బెంగళూరు : కర్నాటకలో రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ వేటు వేశారు. 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నాలుగేళ్ల పాటు సస్పెన్షన్ను స్పీకర్ విధించారు. ఇంతకు ముందే ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి యదియూరప్ప బలనిరూపణకు ఒక్క రోజు ముందు స్పీకర్ రమేష్ కుమార్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుండి వీరిని అసెంబ్లీలోకి అనుమతించేది లేదని స్పీకర్ స్పష్టం చేశారు.
previous post
next post