(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రాజస్థాన్లోని జలోర్ జిల్లా మందవాలా గ్రామంలో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఓ మహిళా సర్పంచ్ వినూత్న నిరసన చేపట్టింది. అక్రమ కట్టడాలను కూల్చేందుకు వచ్చిన అధికారులను నిలువరించేందుకు ఏకంగా జేసీబీకి ఎదురెళ్లింది. దాని ముందటి భాగాన్ని పట్టుకొని పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే.. అక్రమ కట్టడాల కూల్చివేతను గ్రామ సర్పంచ్ రేఖా దేవీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీని కోసం ఆమె స్వయంగా జేసీబీకి అడ్డు తగిలింది. జేసీబీ డ్రైవర్ దాన్ని పైకి లేపినా ధైర్యంగా దాన్ని పట్టుకొని పోరాడింది. ఈ ఘటనతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అయితే, ప్రభుత్వ అధికారుల చర్యలపై స్థానికుల నిరసన పెరిగిపోవడంతో అధికారులు వెనుదిరిగారు. రాజస్థాన్ లో అక్రమ కట్టడాల కూల్చివేత ఇది తొలిసారు కాదు. గతంలోనూ కట్టడాల కూల్చివేతను అడ్డుకునే సమయంలో ఓ జేసీబీ డ్రైవర్ గాయపడ్డాడు.
#WATCH: Rekha Devi, sarpanch of Mandawala village tries to climb a JCB machine in an attempt to stop anti-encroachment drive in Jalore, Rajasthan. (21.11) pic.twitter.com/fxpd93TvVi
— ANI (@ANI) November 22, 2019