ఉదయ్ పూర్: రాజస్థాన్లో పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ట్రక్ వరదల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా నీటిలో బోల్తా పడిన వాహనం నుంచి చిన్నారుల్ని స్థానికులు చాకచక్యంగా రక్షించారు. రాజస్థాన్ డుంగర్పుర్లో భారీ వర్షాలకు రోడ్లన్నీ నదులుగా మారాయి. వరద ప్రవాహానికి వాహనాలన్నీ ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. డుంగర్పుర్, ఉదయపుర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 12 మంది బడి పిల్లలు, కళాశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ ట్రక్ ప్రమాదంలో చిక్కుకుంది. విద్యార్థులను త్వరగా ఇంటికి చేర్చాలన్న ఆలోచనతో ట్రక్ డ్రైవర్ వరదలోనే వాహనాన్ని ముందుకు నడిపాడు. దీంతో అదుపుతప్పి ట్రక్ కుంటలోకి దిగిపోయింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన చిన్నారులు కాపాడమంటూ గట్టిగా అరిచారు. వెంటనే స్పందించిన స్థానికులు, వాహనదారులు.. వర్షాన్ని, వరదను లెక్క చేయక ట్రక్కు తాడు కట్టి విద్యార్థులను బయటకు రప్పించారు. స్థానికులంతా కలిసి చిన్నారుల ప్రాణాలు కాపాడారు. కొంచెం ఆలస్యమైనా బస్సుతోపాటు చిన్నారులు వరదల్లో కొట్టుకుపోయేవారు.
#WATCH: Narrow escape for 12 school children after the truck they were travelling in veered off the flooded road in Dungarpur, Rajasthan. (28/09) pic.twitter.com/OtelfUn3Z6
— ANI (@ANI) September 29, 2019