న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఫరీదాబాద్ లో ఒక ఎన్నికల ఏజెంటు మహిళలు ఓటు వేసేటప్పుడు ఏకంగా ఈవీఎం వద్దకు వెళ్లి తానే ఓటు వేస్తున్న దృశ్యం సోషల్ మీడియాకు ఎక్కింది. దాంతో అతగాడు ఇప్పుడు అరెస్టయ్యి జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది. హరియాణాలోని ఫరీదాబాద్ లో ఆరోదశ పోలింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.
నీలం రంగు టీ షర్టు వేసుకున్న వ్యక్తి ఫరీదాబాద్ లోక్ సభ స్థానంలో అసవోటి పోలింగ్ కేంద్రంలో ఏజెంటుగా పనిచేస్తున్నాడు. మహిళలు ఆ గదిలో వరుసలో నిలబడి ఉన్నారు. వరాిలో ఒక మహిళ ఓటు వేయడానికి సిద్ధపడినప్పుడు ఈ వ్యక్తి ఈవీఎం ఉన్న బూత్ లోకి వెళ్లి మరీ అక్కడ ఈవీఎంలో బటన్ నొక్కి, తన సీటు వద్దకు తిరిగి వచ్చాడు. మరో ఇద్దరు మహిళల విషయంలోనూ అతడలాగే చేశాడు. పైగా అప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్నికల అధికారులు కూడా అతడిని ఆపేందుకు ప్రయత్నించలేదు.
ఈ తతంగాన్ని ఎవరో ఒక వ్యక్తి తన సెల్ ఫోనులో షూట్ చేసి, వీడియోను ట్విట్టర్ లో పెట్టడంతో పాటు హరియాణా ఎన్నికల సంఘాన్ని కూడా ట్యాగ్ చేశారు. దాన్ని చాలామంది వెంటనే షేర్ చేశారు.
एक नेता को जिताने के लिए ये तरीका सही नहीं है! ! ये संविधान, कानून और नैतिकता के खिलाफ भी है! ! ! गाँव असावटी पलवल (हरियाणा) pic.twitter.com/m2euOOBkf2
— SHAHID KURESHI (@UqAsmTfpZGNwK0e) May 12, 2019
వెంటనే ఫరీదాబాద్ లోని జిల్లా ఎన్నికల కార్యాలయం స్పందించింది. ‘‘తక్షణ చర్య తీసుకున్నాం. ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆ వ్యక్తి జైల్లో ఉన్నాడు. పరిశీలకుడు స్వయంగా దీనిపై విచారణ జరిపి, పోలింగుకు ఇబ్బంది కలగలేదని చెప్పారు’’ అని ట్వీట్ చేసింది. వెంటనే చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో స్పందన వచ్చింది. కనీసం ముగ్గురు మహిళలను అతడు ప్రభావితం చేశాడని స్థానిక ఎన్నికల కార్యాలయం తెలిపింది.
అతడు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పినా, పోలింగ్ ప్రక్రియకు మాత్రం విఘాతం కలగలేదంది. అయితే, పోలింగ్ సజావుగా జరిగిందని ఎలా చెబుతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా చెప్పారు. ఎన్నికల అధికారి ఫిర్యాదుమేరకు ఆ ఏజెంటును అరెస్టు చేసి, అతడిపై బూత్ కాప్చరింగ్ కింద కేసు పెట్టారు.
Matter taken very seriously by the administration of Faridabad district. ARO Bharat Bhushan Gogia HCS rushed to the spot . Soon he was joined by the observer SH. Sanjay Kumar who investigated the entire matter.
— DISTRICT ELECTION OFFICE FARIDABAD (@OfficeFaridabad) May 12, 2019
The person in the video is the Polling agent who has been arrested in the afternoon itself. FIR lodged. He was trying to effect at least 3 lady voters. Observer & ARO with teams visited the booth at Asawati in prithala constituency. He is satisfied that voting was never vitiated
— DISTRICT ELECTION OFFICE FARIDABAD (@OfficeFaridabad) May 12, 2019
ఫరీదాబాద్ ఎన్నికల పరిశీలకుడి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం చెప్పింది. హరియాణాలోని పది పార్లమెంటరీ నియోజకవర్గాలలో 69.50 శాతం ఓట్లు పోలయ్యాయి. ఫరీదాబాద్ లో 64.46% పోలింగ్ నమోదైంది.