న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ను విడతీయడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై ఆయన మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ భద్రతకు తీవ్ర పరిణామాలు తెచ్చి పెడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం ప్రజల సమైక్యతతో ఏర్పడిందనీ ఇది భూముల కలయిక కాదని ఆయన అన్నారు. కశ్మీర్లో ప్రజా ప్రతినిధులను జైళ్లలో వేయడం, గృహ నిర్భందంలో ఉంచడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని రాహుల్ వ్యాఖ్యానించారు.
‘జమ్ము కశ్మీర్ ను ఏకపక్షంగా విడదీయడం ద్వారానో లేదంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను జైళ్లలో వేయడం ద్వారానో జాతి సమైక్యత పెరగదు. ఇది రాజ్యాంగ స్పూర్తిని దెబ్బ తీస్తుంది. ఎందుకంటే ఈ దేశం మనుషుల ఐక్యతతో ఏర్పడింది కానీ భూములు, ప్లాట్లతో కాదు. కార్యనిర్వాహక అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మన జాతీయ భద్రతకు తీవ్ర పరిణామాల్ని తెచ్చి పెడుతుంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
previous post