న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య సంవాదం ఆసక్తికరంగా పరిణమిస్తున్నది. ఇన్ని షరతులు పెడితే లాభం లేదంటూ కాంగ్రెస్ నేతకు ఇచ్చిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకున్న మాలిక్కు రాహుల్ మళ్లీ బదులిచ్చారు. ఒక్క షరతు కూడా లేదు. ఎప్పుడు కశ్మీర్ రమ్మంటారో చెప్పండి అంటూ ట్వీట్ చేశారు.
కశ్మీర్లో హింసాయుత నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయన్న రాహుల్ వ్యాఖ్యలకు మాలిక్ అభ్యంతరం చెప్పడంతో ఈ సంవాదం మొదలయింది. కశ్మీర్ వచ్చి పరిస్థితులు స్వయంగా పరిశీలించాల్సిందిగా ఆయన సోమవారం రాహుల్ గాంధీని ఆహ్వానించారు. విమానం పంపుతానని పేర్కొన్నారు.
దానికి రాహుల్ గాంధీ బదులిస్తూ, విమానం అక్కర్లేదనీ, అయితే తనతో పాటు ప్రతినిధి బృందం ఉంటుందనీ, తాము ఎక్కడికంటే అక్కడికి వెళ్లేందుకు అనుమతించాలనీ కోరారు. ఇన్ని షరతులయితే ఆహ్వానాన్ని ఉపసంహరించుకుంటున్నానని మాలిక్ పేర్కొన్నారు.
Dear Governor Malik,
A delegation of opposition leaders & I will take you up on your gracious invitation to visit J&K and Ladakh.
We won’t need an aircraft but please ensure us the freedom to travel & meet the people, mainstream leaders and our soldiers stationed over there. https://t.co/9VjQUmgu8u
— Rahul Gandhi (@RahulGandhi) August 13, 2019
బుధవారం రాహుల్ మళ్లీ ట్వీట్ చేశారు. ఈసారి గవర్నర్ పేరును ఇంగ్లీషులో భిన్నంగా రాశారు. Malik బదులు Maalik అని రాశారు. ఈ హిందీ పదానికి ప్రభువు, యజమాని అని అర్ధం. మాలిక్జీ నా ట్వీట్కు మీ దుర్బలమైన జవాబు చూశాను. ఎలాంటి షరతులు లేకుండా కశ్మీర్ వచ్చి ప్రజలను కలవాలన్న మీ ఆహ్వానాన్ని మన్నిస్తున్నాను. ఎప్పుడు రమ్మంటారు అని రాహుల్ ట్వీట్ ద్వారా అడిగారు.
Dear Maalik ji,
I saw your feeble reply to my tweet.
I accept your invitation to visit Jammu & Kashmir and meet the people, with no conditions attached.
When can I come?
— Rahul Gandhi (@RahulGandhi) August 14, 2019