అమరావతి: ఏపి శాసనసభ నుండి వరుసగా నాల్గవ రోజు టిడిపి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిమాండ్లపై తమ నాయకుడు చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి సభ్యులు బయటకు వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా చంద్రబాబు స్పీకర్ తమ్మినేని సీతారాంకు నమస్కారం పెట్టి బయటకు వెళ్లారు. అనంతరం స్పీకర్ ఛాంబర్ వద్ద టిడిపి సభ్యులు కొద్దిసేపు నిరసన తెలియజేశారు.
టిడిపి సభ్యుల తీరుపై వైసిపి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఏపి మార్కెటింగ్ బిల్లుతో పాటు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందే ముందు కావాలనే గొడవపెట్టుకొని టిడిబి సభ్యులు బయటకు వెళ్లిపోయారని వైసిపి సభ్యులు ఆరోపించారు.