అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ రివర్స్ టెండరింగ్ లోనూ జగన్ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఏడు శాతం లెస్ తో మేఘ సంస్థ పనులను దక్కించుకోవడంతో ప్రభుత్వానికి 86 కోట్ల రూపాయలకు పైగా ఆదా అయింది.553.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంగా జలవనరుల శాఖ టెండర్లను ఆహ్వానించగా ఏడు శాతం లెస్ కు మేఘ సంస్థ పనులను దక్కించుకున్నది.491.6 కోట్లకు రివర్స్ టెండరింగ్ లో ఎల్ 1 గా మేఘ సంస్థ నిలిచింది.
గతంలో 597.35 కోట్ల కు ఈ పనులను సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ సంస్థ దక్కించుకున్నది. నాడు 4.69 శాతం ఎక్సెస్ కు రిత్విక్ సంస్థ పనులు దక్కించుకున్నది.
వెలిగొండ రెండో టన్నెల్ పనులు టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ నిర్ధారించింది. నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కి వెళ్లగా ప్రభుత్వానికి 86 కోట్లు అదా అయింది.