అమరావతి: అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య ట్వీట్ల వార్ ఆసక్తిగా కొనసాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేయడం నిత్యకృత్యమైపోయింది. నేడు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేయగా, వైసిపి ప్రభుత్వాన్ని చంద్రబాబు తనయుడు లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గత ప్రభుత్వ పనులపై విచారణకు ఆదేశిస్తే ఏ తప్పూ చేయని వారికి ఆందోళన ఎందుకని విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
‘ఒక వైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటారు. ఇంకో పక్క మాపై విచారణకు ఆదేశించి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటారు. ఏ తప్పు చేయని వారికి ఆందోళన ఎందుకు చంద్రబాబు’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
ఇందుకు ప్రతిగా వైసిపి ప్రభుత్వంపై టిడిపి ఎమ్మెల్సీ లోకేష్ విమర్శలు చేశారు.
రాష్ట్రంలో వైకాపా అధికారంలో ఉందని మరిచిపోయారా అని లోకేష్ ప్రశ్నించారు. ‘విత్తనాలు జగన్ ప్రభో అంటూ రైతులు గగ్గోలు పెడుతుంటే! చంద్రబాబు వల్లే విత్తనాలు ఇవ్వలేకపోతున్నామంటున్నారు. ఒకటో తారీఖున వచ్చే పింఛను రాలేదేమని పండుటాకులు నిలదీస్తే గత ప్రభుత్వం వల్లే ఆలస్యమైందని సమాధానం ఇస్తున్నారు’ అని లోకేష్ పేర్కొన్నారు. ‘భీమా రాలేదు..మా బతుకుల ధీమా ఏదీ అంటే! తెలుగుదేశం సర్కార్ వల్లే అంటూ మాట దాటవేస్తున్నారు. నేను విన్నాను..నేను ఉన్నానంటూ..సీఎం అయ్యి పాలన చేతకాక, ఇప్పుడు చంద్రబాబే వింటాడు. చంద్రబాబే ఉంటాడు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారం వెలగబెడుతున్నది వైకాపానా ? టిడిపినా? అని లోకేష్ ఎద్దేవా చేశారు.
పనిగట్టుకుని బుదర చల్లినంత మాత్రాన వాస్తవాలు మరుగున పడిపోవని అంటూ, దేశంలోనే గరిష్టంగా 28శాతం పెరుగుదలను నమోదు చేస్తూ 2018-19 సంవత్సరానికి ఏపి రికార్డు స్థాయిలో 20,746కోట్ల రూపాయల జిఎస్టి వసూళ్లను సాధించిందనీ, గత ఐదేళ్లు రాష్ట్రాన్ని ఎలా పురోగమింపచేశామో చెప్పడానికి ఇది నిదర్శమని లోకేష్ పేర్కొన్నారు.
బీమా రాలేదు..మా బతుకుల ధీమా ఏదీ అంటే!
తెలుగుదేశం సర్కారు వల్లే అంటూ మాట దాటవేస్తున్నారు.నేను విన్నాను.. నేను ఉన్నానంటూ.. సీఎం అయ్యి, పాలన చేతకాక, ఇప్పుడు చంద్రబాబే వింటాడు, చంద్రబాబే ఉంటాడు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారం వెలగబెడుతున్నది వైకాపానా? తెదేపానా?
— Lokesh Nara (@naralokesh) July 2, 2019
దేశంలోనే గరిష్టంగా 28 శాతం పెరుగుదలను నమోదుచేస్తూ.. 2018-19 సంవత్సరానికి ఏపీ రికార్డు స్థాయిలో రూ.20,746 కోట్ల జీఎస్టీ వసూళ్ళను సాధించింది. గత ఐదేళ్ళూ రాష్ట్రాన్ని ఎలా పురోగమింప చేశామో చెప్పడానికి ఇది నిదర్శనం. పనిగట్టుకుని బురద చల్లినంత మాత్రాన వాస్తవాలు మరుగున పడిపోవు. pic.twitter.com/mKfaILkTgY
— Lokesh Nara (@naralokesh) July 2, 2019
ఒక వైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటారు. ఇంకో పక్క మాపై విచారణకు ఆదేశించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటారు. ఏ తప్పూ చేయని వారికి ఆందోళన ఎందుకు చంద్రబాబు గారూ? రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 2, 2019