IPL Guinness World Record: ఇండియాలో ఈసారి ఐపీఎల్ సీజన్ లో గతంలో కంటే కొత్త జట్లు కూడా రావడంతో చాలా మ్యాచులు జరగడం తెలిసిందే. అయితే ఫైనల్లోకి వస్తాయి అనుకున్న టీంలు ఉండగానే దుకాణం సర్దుకుని వెళ్ళి పోయాయి. ముఖ్యంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్.. ఖచ్చితంగా ఐపీఎల్ ఫైనల్ లో వస్తుందని భావించారు కానీ దురదృష్టం వెంటాడుతుంది సెమీ ఫైనల్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఆదివారం గుజరాత్ టైటాన్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ మ్యాచ్లో ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ జెర్సీని రూపొందించడం జరిగింది. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించడం జరిగింది. గుజరాత్ లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ చూడటానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో ఆయన చేతుల మీదగా… స్టేడియంలో ఈ అతిపెద్ద జెర్సీని ఆవిష్కరించారు. ఈ అతిపెద్ద జెర్సీ పై తాజా సీజన్ ఐపీఎల్ లో ఆడిన 15 జట్లు లోగో సింబల్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డును సర్టిఫికెట్ ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ కి అందించడం జరిగింది.
దాదాపు మూడు నెలల పాటు ఏకధాటిగా ఐపీఎల్ సీజన్ ఈసారి జరగటంతో క్రికెట్ లవర్స్ బాగా ఆస్వాదించారు. గత రెండు సంవత్సరాలు కరోనా నేపథ్యంలో స్టేడియం లలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు జరిగాయి. కానీ ఈ సారి మాత్రం ప్రారంభంలో కొన్ని ఆంక్షలతో.. కొంతమందిని పంపించగా మరి కొద్ది రోజులకు పూర్తిగా స్టేడియం నిండిపోయేలా ఆంక్షలు ఎత్తివేసి.. మ్యాచ్ లు తిలకించడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. దీంతో ఆదివారం గుజరాత్ టైటాన్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ కి స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది.