ప్రస్తుతం ఉరుకులు పరుగుల మధ్య జీవితం గడుస్తుంది. వయసు ఆరోగ్యం ఉన్న సమయంలో ఆరోగ్యంపై శ్రద్ద చూపకుండా ఉండేవారు ఈ కాలంలో ఎంతోమంది ఉన్నారు. ఇక ఉదయం లేటుగా లేయడం టిఫిన్ చేయకుండా ఉండడం.. ఆకలి వేసినసమయంలో బయట ఏదోకటి తినడం ఈ కాలం వారికీ అలవాటుగా మారిపోయింది.
అదే ఒకప్పటి వారు అయితే రకరకాల ధాన్యాలతో ఆహార పదార్థాలను చేసుకునేవారు. ముఖ్యంగా రాగులు, జొన్నలు, గోధుమలు, సజ్జలు వంటి వాటితో ఎక్కువ వంటకాలు చేసుకునేవారు. ప్రస్తుతం ఇవి మార్కెట్ లో దొరికిన కూడా కొనుగోలు చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అప్పట్లో అలాంటి ఆహారాన్ని తినే వాళ్లు కాబట్టి ఎంత వయసు వచ్చి ఆరోగ్యంగా ఉండేవారు.
ప్రస్తుతం కొన్ని చోట్లలో జొన్నలు, రాగులను తీసుకునేవారున్నారు. ఎందుకంటే జొన్నలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. జొన్నలతో చేసిన రొట్టెలు తీసుకోవడం వల్ల అందులో ఉన్న కార్బోహైడ్రేట్ శరీరంలో అరుగుదల నెమ్మదిగా ఉంటుంది. షుగర్ సమస్య ఉన్న వాళ్ళు జొన్న రొట్టెలు తీసుకుంటే శరీరంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. ఇక అంతేకాదు దాని వల్ల బరువు కూడా బాగా తగ్గుతారు.
జొన్న రొట్టెలను ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంచేందుకు సాయపడుతుంది. జొన్నల్లో కాపర్, కాల్షియం ఉంటుంది. దాని వల్ల ఎముకలు గట్టిపడతాయి. అందులోవుండే ఐరన్ రక్త శాతంను అదుపులో పెంచుతుంది. జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగుతుంది. అరుగుదల అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా జొన్నలలో ఉండే పోషక విలువలు గుండెకు సంబంధించిన సమస్యలను కూడా అదుపులో ఉంచేందుకు సాయపడుతుంది. జొన్న రొట్టెలు చేయడానికి సమయం ఎక్కువగా తీసుకున్నా అవి తినడం వల్ల మన జీవిత కాలంను పెంచుతుంది అని వైద్య నిపుణులు తెలిపారు.