కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి ఇప్పటికే దేశవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి పై పలు సార్లు ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఇప్పుడు అతని పని తీరు ప్రపంచ దేశాలను సైతం మెప్పిస్తుంది. యూకే డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తున్న విధానాల ను చూసి ప్రపంచ దేశాలు పాఠాలు నేర్చుకోవాలని అన్నాడు. ఏపీలో తరహా యూకేలో వాలంటీర్ వ్యవస్థను అమలు చేసేందుకు దేశాధినేతలు ప్రయత్నిస్తూ ఉండటం గమనార్హం.
ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ, ప్రభుత్వం విధి విధానాలు, కరోనా వైరస్ ను అరికట్టేందుకు జగన్ తీసుకున్న నిర్ణయాలపై యూకే డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఆరాతీశారు. ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు 11,158 గ్రామ కార్యదర్శులు మరియు 4.5 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తున్న తీరు చూసి ఆయన ఆశ్చర్యపోయి జగన్ యొక్క ముందు చూపును కొనియాడారు.
అలాగే ప్రతి 10 లక్షల మందిలో 14వేలమందికి టెస్టులు నిర్వహించారని.. అలాగే టెక్నాలజీ సాయంతో క్వారంటైన్ను మానిటర్ చేయడంపై ప్రశంసలు కురిపించారు.. ఇది ప్రపంచానికి ఒక పాఠంగా అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం నుంచి యూకే డిప్యూటీ హై కమిషన్ సలహాలు తీసుకుంటుందని, దేశం మొత్తం ఏపీ పరిపాలన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఏపీ సక్సెస్ మోడల్ దేశ వ్యాప్తంగా ఆకర్షిస్తుంది.