(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రతి ఏటా జరిగే జగన్నాధ రధయాత్ర సందర్భంగా పూరిలో గురువారం ఒక అద్భుతం చోటుచేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ రధయాత్ర పూరి పట్టణంలో కదులుతోంది. భక్తులతో రహదారి కిక్కిరిసి పోయింది. అలాంటప్పుడు అంబులెన్స్ ఒకటి ఆ దారిని వెళ్లాల్సివచ్చింది. వలంటీర్లు రోడ్డుకు రెండు వైపులా మానవహారంగా ఏర్పడి ఆ అంబులెన్స్కు దారి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆన్లైన్లో దీనిని చాలామంది వీక్షించారు. అనేకమంది నెటిజెన్లు ఈ ఫీట్ను పొగిడారు.
1200 మంది వలంటీర్లు గంటల తరబడు ప్రాక్టీసు చేసి ఇది సాధించగలిగారని పూరి పోలీసులు ట్విట్టర్లో పేర్కొన్నారు.
1200 volunteers, 10 organizations and hours of practice made this human corridor for free ambulance movement possible during Puri Rath Yatra 2019. pic.twitter.com/zVKzqhzYCw
— Puri Police (@SPPuri1) July 6, 2019