అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది తనపై చూపిన ఆప్యాయత తన జీవితంలో ఒక మధుర జ్ఞాపకం అని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోది ఆప్యాయంగా పిలిచి కరచాలనం చేసిన వీడియోను విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పోస్టు చేయగా వేలాది మంది అభిమానులు లైక్లు ఇస్తూ రిట్వీట్ చేస్తున్నారు.
నిన్న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం నరేంద్ర మోది బయటకు వెళుతూ లాబీలో వైసిపి అధినేత, సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కోసం నిరీక్షిస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని చూసి ‘హాయ్ విజయ్ గారు’ అని పలకరించి ఆయన వైపు అడుగులు వేసి కరచాలనం చేశారు. ‘ఊహించని ఈ ఘటన నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బయటకు వెళుతూ లాబీలో శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కోసం నిరీక్షిస్తున్న నన్ను చూసి 'హాయ్ విజయ్ గారు' అని పలకరిస్తూ నావైపుకు అడుగులు వేసి నాతో కరచాలనం చేశారు. ఊహించని ఈ ఘటన నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం. pic.twitter.com/7zfxU6xewK
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 19, 2019