అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద ఇప్పటి వరకూ జరిగిన పనులు, ఇంకా జరగాల్సిన పనుల వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు జగన్కు వివరించారు. కాపర్ డ్యామ్ పనులు, ఇతర సాంకేతిక అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలి సారిగా నేడు జగన్మోహనరెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రాజెక్టు స్థితిగతులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష జరిపిన జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. సిఎం వెంట ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
previous post
next post