RRR case: రఘురామకృష్ణ రాజు.. RRR case రాష్ట్ర ప్రభుత్వానికి రోజురోజుకీ చిక్కులు తెచ్చిపెడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఏపీ సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్రాల గవర్నర్లకు, ఏపీ మినహా అన్ని రాష్ట్రాల సీఎంలకు, ఎంపీలకు లేఖలు రాసారు. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రతిష్ట దేశం ముందు మసకబారేలా ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆయన్ను మీడియా ముందు మాట్లాడొద్దంటే.. ఆయన మౌనంగానే ఉంటూ చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరును ఎండగడుతూనే.. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని రెండు పేజీల లేఖ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతోపాటు గజేంద్రసింగ్ షెకావత్ ను కూడా కలవాల్సి ఉంది. ఆఖరు నిమిషంలో టూర్ క్యాన్సిల్ కావడంతో రఘురామ ముందుగానే షెకావత్ ను కలిసారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ పేరుతో కొత్త టెండర్లలో అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. నిర్వాసితులకు పరిహారం ప్రకటిస్తూనే 25 శాతం కమిషన్లను ప్రభుత్వంలోని పెద్దలు కోరుతున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలంటూ ఆయన కేంద్రమంత్రికి లేఖ ఇచ్చారు. ఇప్పుడిదే అంశం హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో నవయుగ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ తక్కువకే మేఘా ఇంజనీరింగ్ కు పోలవరం అప్పజెప్పింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం.
Read More: MP Raghuramakrishna Raju: రఘురామ సెల్ ఫోన్ ఏమైనట్టు..? ఎవరి వాదన వారిదే..!!
ఇప్పుడు ఇందులోనే అవినీతి జరుగుతోందని రఘురామ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆర్ & ఆర్ ప్యాకేజీని కూడా కేంద్రమే ఇవ్వాలని కోరుతోంది. కానీ.. కేంద్రం ససేమిరా అంటోంది. పైగా.. పాత అంచనాలకే కట్టుబడి ఉన్నామని చెప్తోంది. పోలవరంలో పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. రఘురామ ఆయన్ను డైరక్ట్ గా కలిసి తన అనుమానాలు, అభిప్రాయాలు చెప్పారు. త్వరలో ఎప్పుడైనా సీఎం జగన్ కేంద్ర మంత్రి షెకావత్ ను కలుస్తారు. ఈ నేపథ్యంలో షెకావత్ కు ప్రభుత్వం మాట వినాలి. కానీ.. ఆయన స్టాండ్ ఏంటో అప్పుడే తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిక్ కుమార్ యాదవ్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.