Nayan-Vignesh: గత ఆరేళ్ల నుంచీ ప్రేమాయణం నడిపిస్తున్న లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్లు పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ‘నానుమ్ రౌడీ ధాన్’ అనే సినిమాతో నయన్-విఘ్నేశ్ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారగా.. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. జూన్ 9 ఉదయం మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో అంగరంగవైభవంగా నయన్-విఘ్నేశ్ల వివాహం జరగబోతోంది.తొలిక వీరిద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ, ప్రయాణ పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చనిపించడంతో వివాహ వేదికను మహాబలిపురానికి మార్చారట. హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం నయన్-విఘ్నేశ్లు ఒకటి కాబోతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ తారలు, రాజకీయ నాయకులు కూడా వీరి వివాహానికి హాజరుకానున్నారు. ఇకపోతే నయనతార కాబోయే భర్త విఘ్నేశ్కు ఈ ఖరీదైన ఇంటిని గిఫ్ట్ గా ఇవ్వబోతోందట. ఇప్పటికే సకల సౌకర్యాలతో, లగ్జరీగా నిర్మించిన ఇంటిని భర్త పేరు మీద నయనతార రిజిస్ట్రేషన్ చేయించిందట.
ఈ ఇంటి విలువ దాదాపు రూ. 20 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ఆ ఇంటినే పెళ్లి కానుకగా భర్తకు ఇవ్వబోతోందట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వివాహం అనంతరం నయన్-విఘ్నేశ్లో ఆ ఇంటిలోనే నివాసం ఉండబోతున్నారట.