టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో `లైగర్` అనే మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తే.. రమ్యకృష్ణ, రియల్ బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్, మకరంద్ దేశ్పాండే తదితరులు కీలక పాత్రలను పోషించారు.
బ్యాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్తో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు. ఆగస్టు 25న అంటే మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇప్పటికే బుక్కింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా `లైగర్` ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. టాలీవుడ్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు, ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు లైగర్ సినిమాను వీక్షించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..
`లైగర్ మూవీ ఒక సీటి మార్ మాస్ ఎంటర్టైనర్. విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో చేశాడు. సినిమా మొత్తం విజయ్ ఒక్కడే కనిపిస్తాడు. యాక్షన్ స్టంట్స్, దర్శకత్వం అద్భుతంగా ఉన్నాయి. ఇక రమ్యకృష్ణ ఒక సర్ప్రైజ్ ప్యాకేజీ. స్టోరీ, స్క్రీన్ప్లే మాత్రం యావరేజ్గా ఉన్నాయి` అని ఉమైర్ సంధు పేర్కొన్నారు. అలాగే 3 స్టార్ రేటింగ్కు కూడా ఇచ్చారు. మరి ఈ సినిమా రేపు ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
Yes for those asking, #Liger is a One time Watch Action Mass Entertainer with Typical #PuriJagannadh Style Direction. #VijayDeverakonda & #RamyaKrishnan Terrific Performances. Story & Screenplay is Decent. Overall i enjoyed this Saga.
⭐⭐⭐
— Umair Sandhu (@UmairSandu) August 24, 2022