అమరావతి: తప్పుడు వార్తలు ప్రచురించినందుకు వైసీపీ మద్దతుదారులు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు క్షమాపణలు చెప్పాలని ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. గురువారం( డిసెంబర్ 12) తాము రైతు సౌభాగ్య దీక్షలో ఉంటే..అసెంబ్లీలో ఉన్న రాపాకకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేశామని ముందుగా..వైసీపీ సంబంధిత వైబ్ సైట్లో రావడం చూస్తుంటే..ఎవరు చేయించారో అర్థమౌతుందని తెలిపారు. దీనిని నియోజకవర్గ ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. అంతేగాకుండా, రాపాకను అరెస్టు చేసి బెయిల్ రానివ్వకుండా వైసీపీ నాయకులు ప్రయత్నిస్తే..స్వయంగా రంగంలోకి తాను దిగితే..వారు వెనక్కి తగ్గారన్న సంగతి నియోజకవర్గ ప్రజలు అందరూ జ్ఞాపకం చేసుకోవాలని సూచించారు. తప్పుడు వార్తలు ప్రచురించినందుకు వైసీపీ మద్దతుదారులు రాపాకకు క్షమాపణలు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.
YCP supporters should stop spreading lies and hate messages and they should apologise to Sri Rapaka Vara Prasad garu. pic.twitter.com/ERjEce20wx
— Pawan Kalyan (@PawanKalyan) December 13, 2019