NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పర్చూరుకు ఆమంచి.. వెంకటగిరికి నెదురుమల్లి ఇన్ చార్జిలుగా నియమించిన వైసీపీ.. ఆనంపై వేటు

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గా, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులైయ్యారు. అదే విధంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి సమన్వయకరత్గా నెదురుమల్లి రాంకుమార్ రెడ్డిని పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఇవేళ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన పార్టీ మారతారు అన్న పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి.‘నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశాం..? ఏం చేశామని ఓట్లడగాలి..? గ్రామాల్లో ఒక్క రోడ్డు వేయలేదు. కనీసం ఓ గుంతకు కూడా తట్టెడు మన్నుపోసి పూడ్చలేకపోయాం’ అని ఎమ్మెల్యే ఆనం ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలకు బిల్లులు ఇవ్వకపోవడంతో అవి పూర్తి కావడం లేదంటూ కామెంట్స్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుండటంతో పార్టీ సీరియస్ అయ్యింది. పార్టీ ఇన్ చార్జి పదవి నుండి ఆయనను తప్పించి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించింది. పార్టీకి నష్టం కల్గించేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై పార్టీ వేసినట్లు అయ్యింది.

Amanchi Krishna Mohan Nedutumalli Ram kumar Reddy

ఇక పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులైయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్, 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి పోతుల సునీత పై విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తర్వాత వైసీపీలో చేరిన ఆమంచి చీరాల వైసీపీ సమన్వయకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి కరణం బలరాంపై పరాజయం పాలైయ్యారు. టీడీపీ నుండి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో పాటు 2014 ఎన్నికల్లో ఆమంచి మీద ఓటమి పాలైన పోతుల సునీత కూడా వైసీపీలో చేరారు. దీంతో చీరాల వైసీపీలో మూడు వర్గాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడి గ్రూపులను సమన్వయపర్చే కార్యక్రమంలో భాగంగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ , పార్టీ పెద్లు పలు మార్లు ఆమంచితో చర్చలు జరిపి పర్చురు ఇన్ చార్జి బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పించినట్లు తెలుస్తొంది.

వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014, 2019 ఎన్నికల్లోనూ పర్చూరులో ఆ పార్టీ అభ్యర్ధులు ఓటమి పాలవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ అయితే పర్చురులో పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

YSRCP Internal: రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు మళ్లీ ఖాయమే ..! కానీ..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N