Higher Education: విద్యావ్యవస్థలో ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాభోధనపైనే ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపి డిగ్రీ కళాశాలలో తెలుగు మీడియం తెరమరుగు కాబోతోంది. ఇకపై అన్ని కళాశాలల్లోనూ తెలుగు మీడియంకు బదులుగా ఆంగ్ల మాథ్యమాన్నే కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలు రెండు అందుబాటులో ఉండగా ఇకపై తెలుగు మాథ్యమం ఒక్కటే అమలు కానుంది. ఇకపై విద్యార్థులు అందరూ ఇంగ్లీషు మీడియంలోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
గత సంవత్సరం డిగ్రీ మొదటి సంవత్సరంలో మొత్తం 2,62,805 మంది ప్రవేశాలు పొందారు. అయితే వారిలో 25 శాతం మంది అంటే 65,701 మంది మాత్రమే తెలుగు మాధ్యమంలో చేరారు. వీరిలోనూ ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం తప్పనిసరి చేయడంతో వీరు తెలుగు మాధ్యమంలో చదివే అవకాశాన్ని కోల్పోనున్నారు.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై మాతృభాషాభిమానుల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మాతృభాషలో అభ్యసించేలా నూతన జాతీయ విద్యా విధానం అవకాశం కల్పిస్తుండగా రాష్ట్రంలో అందుకు విరుద్దంగా జరుగుతుండటం బాధాకరమని భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More:
1.Sidabad Rape Case: సైదాబాద్ ఘటన నిందితుడు రాజు మృతిపై డీజీపీ ఇచ్చిన క్లారిటీ ఇదీ..!!
2. Ayyannapatrudu: అయ్యన్న భలే కవర్ చేసుకున్నారే..!!
3.Justice Kanagaraj: కనగరాజ్.. మూడో పదవికి కాజ్.. ఫెయిలయితే ఏపీలో చాప్టర్ ఇక క్లోజ్..!?