Pawan Kalyan: పిఆర్సీ సమస్యలపై ఏపిలో ఉద్యోగ సంఘాలు కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యింది. పోలీసులు ఎక్కడికక్కడ నేతలను, ఉపాధ్యాయులను, ఉద్యోగులను అడ్డుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో వివిధ జిల్లాల నుండి విజయవాడకు చేరుకుని ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దాదాపు పది పదిహేను రోజులుగా రాష్ట్రంలో ఉద్యోగులు ప్రభుత్వం పోరాటం చేస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
Read More: Pawan Kalyan: ఏంతైనా మిత్రపక్షం కదా..! అందుకే కేంద్ర బడ్జెట్ పై జనసేనాని ప్రశంసల జల్లు..!!
Pawan Kalyan: రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం లేదని చెప్పినందునే
ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం బాధకల్గించిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించే పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అధికారంలోకి రావడానికి ఒక మాట, వచ్చిన తరువాత మరో మాట చెప్పి వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని అన్నారు పవన్ కళ్యాణ్. ఉద్యోగుల ఉద్యమంలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం లేదని ఉద్యోగ సంఘాలు మొదట్లో చెప్పినందునే ఈ అంశంపై ఇప్పటి వరకూ మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు.
జీతాల్లో కోత విధించడం ఉద్యోగులను వంచించడమే
ఉద్యోగుల జీతాలు భారీగా పెంచుతామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచలేదనీ, ఒక వైపు జీతాలు పెంచామని చెబుతూనే వారి జీతాల్లో కోత విధించడం ఉద్యోగులను వంచించడమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. నాలుగు స్లాబ్ లుగా ఉన్న హెచ్ఆర్ఎ ను రెండు స్లాబులకు కుదించడం వల్ల ఒక్కొక్కరికి రూ.5వేల నుండి 8వేల వరకూ జీతం తగ్గిందని ఉద్యోగులు చెబుతున్నారని అన్నారు. చర్చలకు పిలిచి ఉద్యోగ సంఘాల నేతలను అవమానించేలా మాట్లాడటం వల్లనే లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారని అన్నారు. ఉద్యోగుల నిరసన కు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు.