TDP Leaders House Arrest: మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామాహేశ్వరరావులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వీరు గుంటూరు జిల్లా సుద్దపల్లి క్వారీకి బయలుదేరుతున్న నేపథ్యంలో వీరి నివాసాలకు పోలీసులు చేరుకుని హౌస్ అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లాలోని సుద్దపల్లి క్వారీ వద్ద నిన్న సాయంత్రం నుండి ఆందోళన చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో క్వారీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Read More: CPI Narayana: సినిమా టికెట్ ల వివాదం.. చిరు.. జగన్ భేటీలపై సీపీఐ నారాయణ కీలక కామెంట్స్
TDP Leaders House Arrest: సుద్దపల్లి క్వారీ వద్ద ధూళిపాళ్ల దీక్ష
సుద్దపల్లి క్వారీ గుంతల వద్ద ధూళిపాళ్ల నరేంద్ర చేపట్టిన దీక్ష వద్దకు మైనింగ్ అధికారులు రాత్రి చేరుకున్నారు. తహశీల్దార్ ఎన్ఓసీ ఇవ్వడం వల్లనే మైనింగ్ కు అనుమతి ఇచ్చామని అధికారులు దూళిపాళ్లకు తెలిపారు. ఇక్కడ అక్రమ మైనింగ్ ఎంత జరిగిందో లెక్క తేల్చే వరకూ దీక్ష విరమించేది లేదని రాత్రి అంతా దూళిపాళ్ల అక్కడే భైటాయించారు. ఈ నేపథ్యంలో దూళిపాళ్లకు మద్దతు తెలియజేసేందుకు బయలుదేరిన దేవినేని ఉమా, నక్కా ఆనంద బాబుల నివాసాల వద్దకు పోలీసులు చేరుకుని హౌస్ అరెస్టు చేశారు.