Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ పదో వారంకి చేరుకుంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో గీతూ ఎలిమినేట్ కావటం సంచలనం సృష్టించింది. గీతూది ఆన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని బయట జనాలు అంటున్నారు. కానీ మరోపక్క ఆమె హౌస్ లో బిగ్ బాస్ షో మీద ఉన్న అభిమానంతో అతిగా గేమ్ ఆడటానికి ప్రయత్నించి చెత్త లూప్స్ పెట్టడం వల్ల ఆమె ఎలిమినేట్ అయిందని అంటున్నారు.
ఇక సోమవారం ఎపిసోడ్ లో పదోవ వారంకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ రసవతారంగా సాగింది. కెప్టెన్ శ్రీ సత్య నామినేషన్ స్టార్ట్ చేసింది. మొత్తం నామినేషన్ ప్రక్రియలో ఈసారి 9 మంది నామినేట్ అయ్యారు. రేవంత్, బాలాదిత్య, శ్రీ హాన్, కీర్తి, మెరీనా, ఆదిరెడ్డి, వాసంతి, ఇనాయా, ఫైమా.. వీళ్లంతా పదవ వారం నామినేషన్ లో ఉన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియలో భారీగానే గొడవలు జరిగాయి. ఇనాయా చాలామందికి టార్గెట్ అయింది. ఇంకా యధావిధిగా శ్రీహాన్, శ్రీ సత్య వెటకారంగ ముఖా కవళికలతో… వెకిలి చేష్టలు చేశారు. అయితే సేఫ్ జోన్ లో ఉన్న సభ్యులు ఎవరంటే రోహిత్, రాజ్… కెప్టెన్ శ్రీ సత్య.
మొత్తం హౌస్ లో ఇప్పుడు 12 మంది ఉన్నారు. దాదాపు సగం గేమ్ కంప్లీట్ అయిపోయింది. మరి టాప్ ఫైవ్ లో ఎవరు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. హౌస్ లో తోపులు అని అనుకుంటున్నా సభ్యులు తోటి కంటెస్టెంట్లతో వ్యవహరిస్తున్న తీరు… మైనస్ పాయింట్స్ తీసుకొస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇదే రీతిలో ఆ తోపు కంటెస్టెంట్ లు ఆటతీరు అలానే ఉంటే గీతూ మాదిరిగానే… బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చూసే జనాలు.