Bigg Boss 6: ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండియాలో మొదటిసారి హిందీలో స్టార్ట్ చేయక తర్వాత దక్షిణాదిలో ఐదు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యింది. తెలుగులో ఐదు సీజన్ లు కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం ఆరో సీజన్ రన్ అవుతుంది. అయితే ఈ షోకి ఎంటర్టైన్మెంట్ పరంగా క్రేజ్ ఉన్నాగాని మరోపక్క సామాజికంగా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. పలు రాజకీయపార్టీల నాయకులు ఈ షోపై బహిరంగంగాన్నే విమర్శలు చేయడం జరిగింది. షోలో అశ్లీలత పెరిగిపోయిందని ఇటువంటి షోల ద్వారా.. సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారో చెప్పాలని నిలదీస్తూ ఉన్నారు. షో చూసే ఆడియెన్స్ కూడా యాజమాన్యాన్ని నిలదీయాలని కూడా కోరుతున్నారు.
ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితం షోలో అశ్లీలత పెరిగిపోయింది. బిగ్ బాస్ షో రద్దు చేయాలని.. ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ పై రెండు దఫాలుగా విచారణ జరిగింది. తాజాగా గురువారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఈ క్రమంలో షోకు హస్ట్ గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాలలో నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని.. కోర్టు స్పష్టం చేసింది.
నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. బిగ్ బాస్ రియాల్టీ షో “స్టార్ మా” లో ప్రసారమవుతుంది. షోలో అశ్లీలత పెరిగిపోయింది అని.. కుటుంబంతో కలిసి చూడలేకపోతున్నామని షో రద్దు చేయాలంటూ.. వేసిన పిటీషన్ పై జరుగుతున్న విచారణలో కోర్టు తాజాగా నోటీసులు ఇవ్వడం సంచలనం రేపింది.