రాజధాని చట్టాల అమలుపై హైకోర్టు స్టే…ఆగస్టు 14వరకు స్టే అమలు..!!
మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్రం వేయటంతో ఇక ముందకే అంటున్న జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు చట్టాలతో పాటుగా సచివాలయం ప్రభుత్వ కార్యాలయాలతరలింపును అడ్డుకోవాలంటూ అమరావతి జేఏసీ..స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని ఈ రోజు విచారించిన హైకోర్టు గవర్నర్ జారీ చేసిన గజెట్ పైన ఆగస్టు 14 వరకు స్టే విధించింది. ఈ లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని పైన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. పిటీషనర్ల అభ్యంతరాల పైన పూర్తి సమాచారంతో వెంటనే రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
ముందుగా కౌంటర్ దాఖలు చేసేందుకు పది రోజుల సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు. అయితే, పిటీషనర్ల తరపు న్యాయవాదులు ఈ లోగా రాజధాని తరలింపు ప్రక్రియ మొదలు పెట్టే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేసారు. దీంతో..ఆగస్టు 14వ తేదీ వరకు స్టేటస్ కో మెయిన్ టెయిన్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 14వ తేదీకి కేసు వాయిదా వేసింది. ఈ నెల 6వ తేదీన ఇప్పటికే రాజధాని తరలింపు అంశం పైన దాఖలైన 32 పిటీషన్ల పైనా హైకోర్టు విచారించనుంది. అసలు రాజధాని విషయంలో నిర్ణయం కేంద్రానిదా..లేక రాష్ట్ర ప్రభుత్వానిదా తేల్చాలనే వాదనలు కోర్టు ముందుకొచ్చాయి.
దీంతో..ఇప్పుడు స్టే విధించిటంతో ప్రభుత్వం 14వ తేదీ లోగా రాజధాని తరలింపుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా బ్రేకులు పడ్డాయి.రాజధానుల విషయంలోనూ న్యాయ పోరాటమే…ఇప్పటికే రాజధానుల తరలింపు వ్యవహారాన్ని ఎలాగైనా న్యాయ పోరాటం ద్వారా అడ్డుకుంటామని అమరావతి జేఏసీ..ప్రతిపక్ష పార్టీలు చెబుతూ వస్తున్నాయి. అయితే, పిటీషన్లు దాఖలు చేసిన రైతులు తరపున ప్రముఖ న్యాయవాదులు రంగంలోకి దిగారు. సుప్రీంన్యాయవాది అశోక్ భను తో పాటుగా కామత్, ఆదినారాయణ, సంజయ్ సూరనేని, ఉన్నం శ్రవన్ కుమార్ వాదనలు వినిపించారు.
ప్రభుత్వం తరపున తాము కౌంటర్లు దాఖలు చేయటానికి పది రోజులు సమయం అడిగినా..పిటీషనర్ల తరపు న్యాయవాదులు అడ్డు చెప్పారు. రాజధాని తరలింపు పైన స్టే ఇవ్వాలని కోరారు. దీంతో..ముందుగా ఈ నెల 14వ తేదీ వరకు స్టే విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంలోనూ ఇప్పటికే రాజధాని వ్యవహారాల పైన పిటీషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే నిమ్మగడ్డ వ్యవహారంలో చివరి నిమిషం వరకు పోరాడి చివరకు ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఆరా తీస్తున్నారు. దీంతో..ఈ స్టే విషయం పైన ఈ నెల 14 లోగా ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ సమాధానం..ఆ రోజు జరిగే విచారణ ఆధారంగా కోర్టు తదుపరి నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.