NewsOrbit
బిగ్ స్టోరీ

ముఖ్యమంత్రి జగన్ కు ఎదురుదెబ్బ..!

రాజధాని చట్టాల అమలుపై హైకోర్టు స్టే…ఆగస్టు 14వరకు స్టే అమలు..!!

మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్రం వేయటంతో ఇక ముందకే అంటున్న జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు చట్టాలతో పాటుగా సచివాలయం ప్రభుత్వ కార్యాలయాలతరలింపును అడ్డుకోవాలంటూ అమరావతి జేఏసీ..స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని ఈ రోజు విచారించిన హైకోర్టు గవర్నర్ జారీ చేసిన గజెట్ పైన ఆగస్టు 14 వరకు స్టే విధించింది. ఈ లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని పైన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. పిటీషనర్ల అభ్యంతరాల పైన పూర్తి సమాచారంతో వెంటనే రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

ముందుగా కౌంటర్ దాఖలు చేసేందుకు పది రోజుల సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు. అయితే, పిటీషనర్ల తరపు న్యాయవాదులు ఈ లోగా రాజధాని తరలింపు ప్రక్రియ మొదలు పెట్టే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేసారు. దీంతో..ఆగస్టు 14వ తేదీ వరకు స్టేటస్ కో మెయిన్ టెయిన్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 14వ తేదీకి కేసు వాయిదా వేసింది. ఈ నెల 6వ తేదీన ఇప్పటికే రాజధాని తరలింపు అంశం పైన దాఖలైన 32 పిటీషన్ల పైనా హైకోర్టు విచారించనుంది. అసలు రాజధాని విషయంలో నిర్ణయం కేంద్రానిదా..లేక రాష్ట్ర ప్రభుత్వానిదా తేల్చాలనే వాదనలు కోర్టు ముందుకొచ్చాయి.

దీంతో..ఇప్పుడు స్టే విధించిటంతో ప్రభుత్వం 14వ తేదీ లోగా రాజధాని తరలింపుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా బ్రేకులు పడ్డాయి.రాజధానుల విషయంలోనూ న్యాయ పోరాటమే…ఇప్పటికే రాజధానుల తరలింపు వ్యవహారాన్ని ఎలాగైనా న్యాయ పోరాటం ద్వారా అడ్డుకుంటామని అమరావతి జేఏసీ..ప్రతిపక్ష పార్టీలు చెబుతూ వస్తున్నాయి. అయితే, పిటీషన్లు దాఖలు చేసిన రైతులు తరపున ప్రముఖ న్యాయవాదులు రంగంలోకి దిగారు. సుప్రీంన్యాయవాది అశోక్ భను తో పాటుగా కామత్, ఆదినారాయణ, సంజయ్ సూరనేని, ఉన్నం శ్రవన్ కుమార్ వాదనలు వినిపించారు.

ప్రభుత్వం తరపున తాము కౌంటర్లు దాఖలు చేయటానికి పది రోజులు సమయం అడిగినా..పిటీషనర్ల తరపు న్యాయవాదులు అడ్డు చెప్పారు. రాజధాని తరలింపు పైన స్టే ఇవ్వాలని కోరారు. దీంతో..ముందుగా ఈ నెల 14వ తేదీ వరకు స్టే విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంలోనూ ఇప్పటికే రాజధాని వ్యవహారాల పైన పిటీషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే నిమ్మగడ్డ వ్యవహారంలో చివరి నిమిషం వరకు పోరాడి చివరకు ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఆరా తీస్తున్నారు. దీంతో..ఈ స్టే విషయం పైన ఈ నెల 14 లోగా ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ సమాధానం..ఆ రోజు జరిగే విచారణ ఆధారంగా కోర్టు తదుపరి నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

 

author avatar
Special Bureau

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju