BJP-Janasena : భారతీయ జనతా పార్టీ–జనసేన పార్టీ లకి ప్రస్తుతం అసలు పడడం లేదు. పవన్ కళ్యాణ్ ఏకంగా తెలంగాణ బిజెపి పై ధ్వజమెత్తి… మొన్నటి ఎన్నికల్లో తాము టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సహకరిస్తాం కానీ తెలంగాణలో బిజెపికి సహకరించమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి ముందే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సీట్ కూడా ఆంధ్రప్రదేశ్ బిజెపి దక్కించుకొని జనసేన పార్టీకి మొండిచేయి చూపింది.
అప్పుడు మొదలైంది…
ఇప్పుడు అంతా జనసేన–బిజెపి పొత్తు కథ కంచికి వచ్చింది అని అనుకుంటున్నారు. అసలు జనసేన–భారతీయ జనతా పార్టీ చేతులు కలిపినప్పుడే రెండు భిన్న ధ్రువాలు ఎలా ఒకేచోట ఉండగలవు అని అందరికీ అనుమానం కలిగింది. ఇక ఇదే సమయంలో కమలనాథులు రాష్ట్రంలో ఏ మాత్రం పట్టు లేకపోయినా పవన్ కళ్యాణ్ ను మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టారు. ఈ రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువైపోయాయి. వీటికీ గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నాంది పలికాయి అని చెప్పాలి.
పాపం పవన్..!
పవన్ కళ్యాణ్ పాపం ప్రతి చోట తగ్గుతూ వచ్చాడు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను పోటీ చేయించాలని అనుకొని చివరి నిమిషంలో బీజెపి నేతల జోక్యంతో వారిని విత్ డ్రా చేయించారు. ఇక అప్పుడే తిరుపతి ఉప ఎన్నికను జనసేన ఇస్తామని హామీ ఇస్తేనే పవన్ అందుకు ఒప్పుకున్నారని ప్రచారం జరిగింది. తీరా చూస్తే ఇక్కడ కూడా బిజెపి అవకాశం తన్నుకుపోయింది. అందుకు నిరసనగానే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణి కి మద్దతు ఇస్తున్నట్లు పవన్ ప్రకటించారని కూడా పలువురు చెబుతున్నారు.
BJP-Janasena : నేతలూ అంతంతమాత్రమే…
ఒక పక్కేమో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రామచంద్ర పోటీ చేస్తుంటే పవన్ మాత్రం వాణి కి ఓటేయండి అని పిలుపునివ్వడంతో కమలనాథులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ రెండు పార్టీల నేతలకు ప్రస్తుతం కలిసి ఉండడం అసలు ఇష్టం లేదన్న వార్తలు బయటకు వస్తున్నాయి. వారి వ్యవహార శైలి చూస్తేనే ఈ విషయం తేటతెల్లమవుతోంది అని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయవాడ, వైజాగ్ కార్పొరేషన్లో రెండు పార్టీలు వేరు వేరుగానే పోటీ చేశాయి. దాని వల్ల ఎవరికీ ఏమీ ఒరగలేదు అనుకోండి అది వేరే విషయం… అయితే తెగతెంపులు చేసుకోవడానికి మాత్రం జనసేన–బిజెపి రెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. మరి అది ఎంత కాలంలోగా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?