ముందుగా ఈ ఫోటో చూసిన వారెవరికైనా… వెంకయ్యనాయుడు గారు తీసుకుంటున్న శ్రద్ధను అభినందించాల్సిందే.
పరిస్థితులు ఇప్పుడు బాలేవు కొన్నాళ్లు ఈ మాత్రం గ్యాప్ మెయింటేన్ చేయాల్సిందే… ఇక విషయానికి వస్తే… ఏపీ బీజేపీ చీఫ్గా ప్రకటించిన తర్వాత సోము వీర్రాజు…. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. వెంకయ్యను మర్యాదపూర్వకంగా కలిశానని సోమువీర్రాజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ పేజీలో ఫోటోలు పెట్టారు. దేశ వ్యాప్తంగా కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్నతరుణంలో భౌతిక దూరం పాటించాలంటూ చేస్తున్న సూచనలను ఇద్దరు నేతలు తూ.చ తప్పకుండా పాటించారు. ఈ ఫోటోలు చూశాక ఎవరైనా సరే ఈ మాత్రం గ్యాప్ మేయింటేన్ చేయాల్సిందే అంటారు.
అయితే బీజేపీ చీఫ్గా సోము వీర్రాజు నియామకంపై ఇప్పటికే పలు వర్షన్లు విన్పి్స్తున్నాయ్. గతంలో బీజేపీ చీఫ్గా పనిచేసిన కంభంపాటి హరిబాబు, వెంకయ్యకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. నాడు హరిబాబు స్థానంలోనే సోము ఏపీ బీజేపీ చీఫ్ గా కూడా వస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే హరిబాబు తర్వాత కూడా కన్నా లక్ష్మీనారాయణ వచ్చారు కానీ… పార్టీలో మొదట్నుంచి యాక్టివ్ రోల్ లో ఉన్న సోము బీజేపీ చీఫ్ గా రావడానికి ఇంతకాలం పట్టింది. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయ్యాక చాన్నాళ్లకు సోముకు బీజేపీ ఏపీ చీఫ్ గా ప్రమోషన్ లభించింది. మొదట్నుంచి బీజేపీలోనే ఉన్న సోమువీర్రాజు, వెంకయ్యకు చాలా సన్నిహిత సంబంధాలే ఉండే అవకాశం ఉంది.
రాజధాని అమరావతి విషయంలో సోము చేస్తున్న వ్యాఖ్యల ఇప్పుడు బీజేపీలోని ఒక వర్గం నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయ్. అంతేకాదు… అమరావతి విషయంలో బీజేపీ స్టాండ్ కాదని… కేంద్రం స్టాండ్ సానుకూలంగా ఉండాలని…. లేదంటే బీజేపీకి గుడ్బై చెబుతామంటూ కొందరు తెలుగు బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. జై అమరావతి పేరుతో పార్టీ ఏర్పాటుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. సో సోము… వెంకయ్య భేటీ గ్యాప్ గురించి రెండు వర్షన్లు విన్పిస్తున్నారు పార్టీ నేతలు. ఒకటి కరోనా తెచ్చిన భౌతిక దూరమైతే… నాటి జ్ఞాపకాలు ఇద్దరికి గుర్తుకు వచ్చి ఉండొచ్చని… మొత్తంగా ఇది కేవలం భౌతిక దూరం గ్యాప్ మాత్రమే.