Kalki 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంవత్సరం చివరాంతంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” సినిమాతో డిసెంబర్ 22వ తారీకు ప్రేక్షకులను పలకరించి ఈ ఏడాదిలోనే అతిపెద్ద విజయం సాధించటం జరిగింది. “బాహుబలి 2” తర్వాత “సలార్” సినిమాతోనే విజయం సాధించడం జరిగింది. అంతకుముందు చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. “సలార్” మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దీంతో ఇప్పుడు రెండో భాగం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం చాలా బాగుంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలియజేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. “కల్కి 2898 AD”, మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ ఉన్నారు. “కల్కి 2898 AD” సినిమా ప్రభాస్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ బ్యానర్ వైజయంతి మూవీస్ పతాకంపై 50వ సినిమాగా తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి… హాలీవుడ్ టెక్నాలజీ కెమెరాలు వాడుతున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథలో ప్రభాస్ చాలా వైవిధ్యమైన హీరోగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో కమలహాసన్ విలన్ పాత్ర చేస్తున్నారు. అమితాబ్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి బాలీవుడ్ యాక్టర్స్ కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇటీవల బాంబే ఐఐటీలో టెక్ ఫెస్ట్ లో నాగ్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
“ప్రాజెక్టుK” కి “కల్కి 2898 AD” అనే టైటిల్ పెట్టడం వెనక లాజిక్ ఉందని స్పష్టం చేశారు. అది సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో తెలియజేస్తానని స్పష్టం చేశారు. “కల్కి 2898 AD” లో ఫ్యూచర్ ప్రభాస్ ని చూస్తారు. అమితాబ్, కమలహాసన్, దీపికా పదుకొనే గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్రలలో కనిపించి ఉండరు. అభిమానుల అంచనాలకు మించి పాత్రలు ఉంటాయని బాంబే ఐఐటి ఫెస్టివల్ లో నాగ్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. జనవరి 24వ తారీఖు ఈ సినిమా విడుదల చేస్తారని మొదట అధికారిక ప్రకటన చేశారు. అయితే షూటింగ్ కొద్దిగా ఆలస్యం కావడంతో సినిమా విడుదల వాయిదా పడినట్లు టాక్. దీంతో “కల్కి 2898 AD” కొత్త విడుదల తేదీ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు.