Pushpa 2: ఈ ఏడాది యావత్ భారత చలనచిత్ర రంగం ఎదురుచూస్తున్న సినిమా “పుష్ప 2”. 2021లో విడుదలైన “పుష్ప” ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దర్శకుడు సుకుమార్ అద్భుతమైన కథతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నీ తెరపై చూపించిన విధానం దేశంతో పాటు ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంది. దీంతో “పుష్ప” సినిమాలో డైలాగులు, పాటలు, డాన్స్ అని కూడా అందరిని అలరించడం జరిగింది. సినిమాలో తగ్గేదేలా డైలాగు ఇప్పటికీ కూడా ట్రెండింగ్ గా నిలిచింది. “పుష్ప” సినిమా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాకి గాను హీరో అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కి కూడా జాతీయ అవార్డు లభించింది.
దీంతో ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నారు. “పుష్ప” సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే దర్శకుడు సుకుమార్ “పుష్ప” సెకండ్ పార్ట్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పుష్ప ది రైజ్ కి మించి పుష్ప ది రూల్ ఉండనుందని పేర్కొన్నారు. క్వాలిటీ.. ఎమోషనల్ పరంగా సీక్వెల్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుద్ది. ముఖ్యంగా అల్లు అర్జున్.. ఫహద్ ఫాసిల్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా ఉంటాయని తెలిపారు.
ఈ సినిమా ప్రేక్షకులకు భావోద్వేగంతో పాటు థ్రిల్లింగ్ అనుభవాన్ని పంచుతుందని పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్ మరోసారి ట్రెండ్ సెట్ చేయడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది. జాతర సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. మొన్నటి వరకు జైల్లో ఉన్న నటుడు జగదీష్ కూడా ఇటీవల బెయిల్ మీద రిలీజ్ కావటంతో.. అతడికి సంబంధించిన సన్నివేశాలు చాలా త్వరగా చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ నెలలో బన్నీ బర్తడే నేపథ్యంలో “పుష్ప 2” నుండి బన్నీ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆల్రెడీ వర్క్ సుకుమార్ స్టార్ట్ చేసినట్లు టాక్.