Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ సినిమా “గుంటూరు కారం” బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వం ఫెయిల్ అయింది. ఎక్కడా కూడా త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు సినిమాలో లేవు. గతంలో మహేష్ బాబుతో అతడు, ఖలేజా సినిమాలు త్రివిక్రమ్ చేయగ అందులో కొత్తదనం కనిపించింది. కానీ “గుంటూరు కారం” లో అసలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక్క “కుర్చీ మడతపెట్టి” సాంగ్ తో పాటు మహేష్ బాబు డాన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచింది.
సినిమా విడుదల కాకముందే యూట్యూబ్ లో “కుర్చీ మడతపెట్టి” సాంగ్ కి విపరీతమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ లో ఈ లిరికల్ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ దగ్గరలో ఉంది. వీడియో సాంగ్ కి వచ్చేసరికి 40 మిలియన్ వ్యూస్ సాధించింది. సినిమా పరంగా పరాజయమైన గాని మ్యూజిక్ పరంగా తమన్ అందించిన ఈ సాంగ్ మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్టు సాంగ్ గా నిలిచింది. సినిమాలో ఈ సాంగ్ కి మహేష్ బాబు వేసిన స్టెప్పులు అభిమానులను ఎంతగానో అలరించాయి. ఫుల్ ఎనర్జీతో హీరోయిన్ శ్రీలీలతో.. మహేష్ బాబు పర్ఫామెన్స్ కి థియేటర్లు దగ్గరలాయి.
అయినా గాని “గుంటూరు కారం” సినిమా పరంగా అభిమానులను బాగా నిరాశపరిచింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ సమ్మర్ లో స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ₹1000 కోట్ల బడ్జెట్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి జర్మనీలో అడవులలో ఓ టూర్ వేసిన మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి నిర్వహిస్తున్న వర్క్ షాప్ లకు విద్యార్థి మాదిరిగా హాజరవుతున్నట్లు సమాచారం.