Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర దర్శకులలో ఒకరు. క్లాస్ మరియు మాస్ ఆడియన్స్ లను ఆకట్టుకునే విధంగా సినిమాలు చేస్తుంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది టాప్ హీరోలతో సినిమాలు చేశారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో సినిమాలు చేయడం జరిగింది. ఇటీవల మహేష్ బాబుతో “గుంటూరు కారం” సినిమా చేయగా బాక్స్ ఫీస్ వద్ద బోల్తా పడింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది.
మహేష్ బాబు అభిమానులు సైతం త్రివిక్రమ్ సరిగ్గా శ్రద్ధ పెట్టి సినిమా తీయలేదని కామెంట్లు చేయడం జరిగింది. “అలా వైకుంఠపురంలో” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకుని మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వం చేసిన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోయింది. “గుంటూరు కారం” సినిమాతో విమర్శలు పాలైన త్రివిక్రమ్ ఇప్పుడు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అది కూడా మెగా హీరోతో రెగ్యులర్ పంతాకి కాకుండా కొత్త రకం సబ్జెక్టుతో భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
కుటుంబం విడిపోవడం ఆ కుటుంబాన్ని తిరిగి హీరో కలపటం.. చక్కదిద్దటం కాన్సెప్ట్ నీ పక్కన పెట్టనున్నారట. ఇప్పుడు కొత్తగా యూనివర్సల్ సబ్జెక్టు తో సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ కథను ఆల్రెడీ రెడీ చేసినట్లు ఇటీవల మెగా హీరో అల్లు అర్జున్ కి స్టోరీ వినిపించినట్లు సమాచారం. త్వరలోనే అంతా ఓకే అయితే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప 2” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15వ తారీకు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని వెంటనే త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.