Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ నీకు ఒక విషయం చెప్పాలి అని శ్యామ్ అంటాడు. చెప్పండి అని రాధ అంటుంది. పండు ప్రాణాలను కాపాడడానికి సహాయం చేసిన వాళ్లని మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి కదా వాళ్లతో మనకు ఏమైనా గొడవలు అయితే మనం వాటిని మర్చిపోవాలి కదా వాళ్లకి మనం జీవితాంతం రుణపడి ఉండాలి కదా అని అంటాడు శ్యామ్. ఈ విషయం మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా దీనికి ఇంత మొహమాటపడుతున్నారా అని రాధ అంటుంది. ఇంతలో అక్కడికి కిరణ్ వస్తాడు. పండు కి ఎలా ఉంది అని అడుగుతాడు. ఇప్పుడు కోల్కున్నాడు బానే ఉన్నాడని శ్యామ్ తనని ఐ. సి. యు. లోకి తీసుకెళ్తాడు. మీ వల్లే మా పండు ఈ రోజు బ్రతికున్నాడు మీరు లేకపోతే మాకు చాలా ఇబ్బంది అయ్యేది అని రాధ అంటుంది.
నీలాంటి ఫ్రెండ్ దొరకడం మా శ్యామ్ అదృష్టం అని అంటాడు ధనుంజయ్. జరిగిన విషయం తెలియని కిరణ్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటాడు. శ్యామ్ కిరణ్ కి సైగ చేసి నువ్వే ఈ సహాయం చేసావని ఒప్పుకో అని అంటాడు. కిరణ్ నేనే చేశాను అని ఒప్పుకుంటాడు. కట్ చేస్తే,విరాజ్ వాళ్ళ నాన్న తనని పెళ్లికొప్పించడానికి తను పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడడానికి ఒక ఆవిడని తీసుకొచ్చి నేను ఇంకో పెళ్లి చేసుకుంటున్నాను అని రాజీతో చెప్తాడు. అది విని రాజి షాక్ అయిపోయి విరాజ్ కి విషయం చెబుతుంది. విరాజ్ కిందికి వచ్చి చూసేసరికి వాళ్ల నాన్న ఒక అమ్మాయి తో ఉంటాడు. ఏం చేస్తున్నావ్ నాన్న అని అడుగుతాడు విరాజ్. వంశం నిలబడాలి అంటే ఇంకో పెళ్లి చేసుకోమన్నావు కదా అందుకే ఇంకో పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చాను అని అంటాడు విరాజ్ వాళ్ళ నాన్న. విరాజ్ గదిలోకి వెళ్తాడు.
వీడేంటి ఏం మాట్లాడకుండా వెళ్ళాడు బ్యాక్ తీసుకొని బయటికి వెళ్తాడా అలా చేస్తే గనుక వాడిని ఒప్పించి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు వాళ్ళ నాన్న. వీరాజ్ గదిలో నుంచి వచ్చి తాళి ఇచ్చి తన మెడలో కట్టండి అని అంటాడు. వాళ్ళ నాన్న తాళి తీసుకొని కట్టబోతు ఉండగా ఆవిడ మీరేదో నటించమని చెప్తే డబ్బుల కోసం వచ్చాను అంతేకానీ మీరు నిజంగానే కడుతున్నారు ఏంటి అని అంటుంది. నాన్న మీరు నా కోసం ఎన్ని చేసినా నేను మాత్రం మీ జీవితంలో పెళ్లి చేసుకోను అని అంటాడు విరాజ్ .అమ్మ మనం ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతున్నాం అని పండు అడుగుతాడు. రేపు వెళ్ళిపోతాం అని రాధ చెప్తుంది. రాధ శ్యామ్ ని చూసి మేమందరం రేపు డిస్చార్జ్ అవుతున్నందుకు సంతోషపడుతుంటే మీరేంటండి ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. రుక్మిణి చేసిన పని గుర్తొచ్చి వాడు బాధపడుతున్నట్టున్నాడు అని అంటుంది మధుర. పండు దగ్గర ఇలాంటి విషయాలు మాట్లాడకండి అత్తయ్య అని అంటుంది రాధ.
వాడికి కూడా రుక్మిణి గురించి తెలియాలి కదా పండు నీకు ఇలా జరగడానికి కారణం మీ పెద్దమ్మ ఇంకోసారి తను ఏమిచ్చినా తాగకు అని అంటుంది మధుర. రాధ శ్యామ్ బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నన్ను పండును ఎవరు దూరం చేయలేరు అని అంటుంది రాధ. ఎవరో కాదు రాధ నేనే పండును నీకు దూరం చేశాను అంతే కాదు నేను కూడా మీకు దూరం అవుతున్నాను రుక్మిణికి దగ్గరవుతున్నాను అని అనుకుంటాడు శ్యామ్. ఇంతలో రుక్మిణి అక్కడికి వస్తుంది. ఎందుకొచ్చావ్ నువ్వు బయటికి వెళ్ళు అని రాధ అంటుంది. అది నా హక్కు నేను వెళ్తాను నా కొడుకు అని అంటుంది రుక్మిణి. ఏ అధికారంతో వెళ్తావు నీకు ఏ హక్కు ఉంది అని అంటుంది మధుర. వాడు నీ కన్ను కొడుకే కావచ్చు కానీ నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది నేనే అని అంటుంది రాధ.
శ్యామ్ అది అలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి మెడ బట్టి బయటకి గెంటు అంటుంది మధుర. పండు విషయానికొస్తే నేనే ఒక్కొక్కరిని బయటికి గెంటు తాను అని అంటుంది రుక్మిణి. బయటికి గెంటమనండి చూస్తాను గంటు తాడో లేదో అని అంటుంది రుక్మిణి. అదిలా మాట్లాడుతూ ఉంటే మీరు మౌనంగా ఉంటారు ఏంటండీ అని అంటుంది రాధ. శ్యాంసుందర్ నీతో కొంచెం పనుంది అలా బయటికి రా అని అంటుంది రుక్మిణి. శ్యామ్ బయటికి వెళ్తాడు. వీడు ఎందుకండీ ఇలా మారిపోయాడు అని అంటుంది మధుర.
ఆయనకి హాస్పటల్లో గొడవ జరగడం ఇష్టం లేదా అత్తయ్య బయటికి వెళ్ళాక దానికి నాలుగు వాయిస్తాడు అని అంటుంది రాధ. రుక్మిణి శ్యామ్ ని తన ఇంటికి తీసుకెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళగానే దాక్షాయిని మీరు చెప్పినట్టుగా శాంతి నచ్చిన వంటకాలను చేశాను అని అంటుంది. నా భర్తకు నేను వడ్డిస్తాను నువ్వు వెళ్లి నీ భర్త సంగతి చూడు అని అంటుంది రుక్మిణి. రుక్మిణి శ్యామ్ కి వడ్డిస్తుంది.