Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లలు ఇంకా ఏం చేస్తున్నారు వెళ్లి రెడీ అవ్వండి మనం మాత్రమే ఉన్నాం పెళ్లికి వెళ్లొద్దా అని రాథోడ్ అంటాడు. ఎందుకు రాథోడ్ పైకి నవ్వుతూ లోపల బాధపడుతున్నట్టు నటిస్తున్నావ్ అని అమృత అంటుంది. నన్ను క్షమించండి పిల్లలు మీ కష్టాన్ని తీర్చలేక పోతున్నాను తప్పు జరుగుతుందని తెలిసిన ఆపలేకపోతున్నాను ఆ మనోహరిని అడ్డుకోలేక ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండి మిమ్మల్ని రక్షించుకోలేకపోతున్నాను నన్ను క్షమించండి అని రాథోడ్ బాధపడతాడు. అంజలి పరిగెత్తుకెళ్లి రాథోడ్ని హగ్ చేసుకుని ఏడుస్తుంది. రాథోడ్ మాకు ఒక సహాయం చేయగలవా అని అమృత అడుగుతుంది.
ఏంటో చెప్పండి అమ్మ ఏదైనా చేస్తాను అని రాథోడ్ అంటాడు. మమ్మల్ని మిస్సమ్మ మా అమ్మలాగే చూసుకునేది అమ్మ తోటి ఉన్నట్టే మిస్సమ్మతో ఉన్నప్పుడు అంతే సంతోషంగా ఉన్నాము మా అమ్మ తోటి ఉన్నట్టే అనిపించేది ఈ పెళ్లి అయిపోయాక మమ్మల్ని మిస్సమ్మ దగ్గరైన వదిలిపెట్టు లేదంటే హాస్టల్ లో ఉన్న వెయ్యి అని అమృత అంటుంది. అవును రాథోడ్ అమనోహరి ఆంటీ మా డాడీకి మమ్మల్ని దూరం చేసే కంటే ముందే మమ్మల్ని హాస్టల్లో వెయ్యి రాథోడ్ మా డాడీ కి మేము ముందు దూరమైపోతాం ఆ మనోహరి ఆంటీ మమ్మల్ని దూరం చేసి అవకాశం ఇవ్వకండి అని అంజు అంటుంది.
రాథోడ్ మిస్సమ్మ చాలా మంచిది తననే ఇంట్లో నుంచి పంపించేశారు అంటే మా డాడీ కి ఏదైనా చెప్పి మమ్మల్ని దూరం చేస్తుంది అప్పుడు దూరమయ్యే కంటే మాంతటమేమీ దూరం అవుతాం రాథోడ్ అని ఆకాష్ అంటాడు. అ మనోహరి ఆంటీ ఇంట్లో అడిగి పెడితే ఏదైనా చేస్తుంది రాథోడ్ అవ్వని చూస్తే మేము భరించలేం అని ఆనంద్ బాధపడతాడు. నలుగురు అలా మాట్లాడేసరికి రాథోడ్ కి కళ్ళలో నీళ్లు ఆగక ఈ పెళ్లి అయ్యాక ఆ మనోహరి వద్దన్నా కాదన్నా సరే మీ డాడీ తో నేను మాట్లాడి మిమ్మల్ని హాస్టల్ లో వేస్తాను అని రాథోడ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.వాళ్ళమాటలు విన్న అరుంధతి బాగా ఆలోచిస్తుంది పిల్లలు నా దగ్గర ఎలా ఉన్నారో భాగీ దగ్గర అలాగే ఉన్నారు అంత సంతోషంగా ఉన్నారు ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అరుంధతి.
ఈ బాలిక ఈ పిల్ల పిచ్చుకల మాటలు విని ఏ నిర్ణయం తీసుకుంటుందో అని గుప్తా అనుకుంటాడు. బాలిక ఏది కనిపించడం లేదు ఎక్కడికి మాయమైనది అని గుప్తా తన ఉంగరమును అడ్డుపెట్టి చూస్తాడు. తను రోడ్డు మీద పరిగెత్తుకు వెళ్తున్నట్టు కనిపించడంతో పెళ్లి మండపానికి వెళ్తుందని గుప్తా పెళ్లి మంటపానికి వెళ్తాడు. కట్ చేస్తే, మనోహరి కోసం వెతుక్కుంటూ వచ్చిన ఒకతను కార్ నెంబర్ పట్టుకొని ఒక దగ్గరికి వెళ్లి ఈ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది నాకు చెప్పండి అని అంటాడు. అలా చెప్పకూడదు అని అతను అనడంతో ఆ రౌడీ అతనికి కావాల్సినంత డబ్బు ఇచ్చి బెదిరించి ఇప్పుడు చెప్పు మని అడుగుతాడు. ఈ కార్ అమరేంద్ర పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అని తన ఇంటి అడ్రస్ తో సహా చెప్తాడు అతను. అది తెలుసుకున్న ఆ రౌడీ మనోహర్ని వెతుక్కుంటూ అక్కడికి బయలుదేరుతాడు. కట్ చేస్తే,బాలిక కంగారుగా వెళ్తూ కనపడితే ఇక్కడికి వచ్చిందనుకున్నాను ఇక్కడ కూడా లేదు అని మళ్లీ ఒకసారి ధూమ్ తత అని చూస్తాడు గుప్తా.
అరుంధతి మిస్సమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లినట్టు గుప్తా కి తెలిసిపోతుంది.బాలిక చేయుచున్నది చానా పెద్ద తప్పిదము ఇలా ఎందుకు చేయుచున్నది అని గుప్తా అనుకుంటాడు. కట్ చేస్తే, అరుంధతి భాగమతి దగ్గరికి వెళ్తుంది. భాగమతి బాధతో కలనిండా నీళ్లతో భగవంతుడి వంకా చూస్తూ ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితిని నాకు ఇచ్చావు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆ కుటుంబం ఆదుకున్నది అలాంటి కుటుంబానికి సహాయంగా నిలబడదాం అనుకున్నాను కానీ నన్ను దొంగని చేసి ఆ ఇంటి నుంచి పంపించేలా చేశావు ఆ పిల్లని ఆ కుటుంబాన్ని కాపాడ లేకుండా నన్ను దూరం చేశావు ఏం జరిగినా సరే నేను చూస్తూ ఇక్కడే బాధపడుతూ ఉండలేను ఆ పెళ్లిని ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాను లేదంటే పిల్లలు బ్రతుకు అన్యాయమైపోతుంది
పిల్లల్ని అ మనోహరి ఆయనకి దూరం చేస్తుంది అని భాగమతి బాధపడుతుంది. భాగీ నేను బాధపడుతున్నాను అంటే కన్నతల్లిని కాబట్టి నాకు ఆ బాధ ఉంటుంది కానీ నీకెందుకు ఆ కుటుంబాన్ని నా పిల్లలు చూస్తే బాధ కలుగుతుంది నీ ప్రేమని పిల్లలకి దగ్గరి చేయడం కోసమే నన్ను దూరం చేసాడేమో ఆ భగవంతుడు నన్ను క్షమించు భాగీ నీ జీవితాన్ని పణంగా పెట్టి నా కుటుంబాన్ని కాపాడబోతున్నాను అని అరుంధతి వెళ్లి భాగమతి ఒంట్లో ప్రవేశిస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది