Malli: బుల్లితెర పై హీరోయిన్స్ తమ అంద చందాలను ఆరబోసి ఈజీగా పాపులారిటీ సంపాదించుకుంటారు. కానీ హీరోలు మంచి గుర్తింపు పొందాలంటే చాలా కష్టపడాలి. వారి నటన మరియు అందం బాగుంటేనే బుల్లితెరపై వారికి అవకాశాలు దక్కుతాయి. లేదంటే ఒకటి రెండు సీరియల్స్ కే ఇండస్ట్రీకి దూరమవ్వాల్సి వస్తుంది. ఇక కొందరు హీరోలు అయితే బుల్లితెరపై తమ నటన అందాన్ని ప్రదర్శించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో పవన్ సాయి కూడా ఒకరు. తెలుగు బుల్లితెర పైకి మొగలిరేకులు సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన ఈయన అనంతరం కొన్ని సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.
ఇక రీసెంట్ గా పవన్ సాయి నటించిన మళ్లీ సీరియల్ ఎంతోమంది ప్రేక్షకులని ఆకర్షించింది. ఇక ఈ సీరియల్ లో అరవింద్ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నాడు పవన్ సాయి. కానీ సీరియల్ నుంచి అద్దాంతరంగా తప్పుకున్నాడు పవన్ సాయి. ఇక పవన్ సాయి ఈ సీరియల్ నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటి అని చాలామంది అరా తీస్తున్నారు. ఇక ఈ సీరియల్ అనే కాదు ఇతర సీరియల్స్ పై కూడా పవన్ సాయి ఆసక్తి చూపించడం మానేశాడు. మళ్లీ సీరియల్ నుంచి తప్పుకున్న పవన్ సాయి మరి సీరియల్ లోను నటించలేదు. ఇక ఈయన సీరియల్స్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు అని తన ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఇక ఇంతకాలం మీడియ ముందుకు రాని పవన్ సాయి సడన్గా నిన్న లైవ్ లోకి వచ్చాడు.
ఆన్లైన్లో తన ఫాన్స్ తో కాసేపు ముచ్చటించాడు పవన్ సాయి. ఇక పవన్ సాయి లైవ్ కి రావడంతో ఆయన అభిమానులు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఇక ఇందులో భాగంగా పవన్ సాయి ఒక అభిమాని ఓ ప్రశ్న అడిగాడు. ఇక ఈ ప్రశ్నకి పవన్ సాయి ఇచ్చిన ఆన్సర్ షాకింగ్ అని చెప్పుకోవచ్చు. ” అన్నయ్య బాగున్నారా. వదిన మధుమిత ఎలా ఉన్నారు ” అని అడగగా..” నేను ఒంటరిని. నా జీవితం ఒంటరి జీవితం. నా చుట్టూ ఎవరూ లేరు. నాతో కూడా ఎవరూ లేరు ” అంటూ పవన్ సాయి స్పందించాడు. దీంతో తన అభిమానులు షాక్ అయ్యారు. ఇక ఈయన తన భార్యతో విడిపోయిన విషయం అఫీషియల్ గా ప్రకటించినట్లు అనిపించింది ప్రతి ఒక్కరికి. ప్రస్తుతానికి అయితే ఈయన తన భార్యతో కలిసి లేడు.
కొంతకాలం క్రితం మధుమిత అనే ఒక హెయిర్ హోస్టర్ ని పెళ్లాడిన పవన్ సాయి ప్రస్తుతం వీరిద్దరూ కలిసి లేరు. వీరిద్దరూ అర్ధాంతరంగా అనుకోని కారణాల చేత విడిపోయినట్లు తెలుస్తుంది. పవన్ సాయి ముద్దమందారం యాక్ట్రెస్ తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు అనేక ప్రచారాలు జరిగాయి. ఇక ఇందువల్లే తనకి తన భార్యకి మనస్పార్ధాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక పవన్ సాయి మరియు ముద్దమందారం హీరోయిన్ కలిసి చాలాసార్లు మీడియా కంట కూడా పడ్డారు. ఇక రీసెంట్ గా జరిగిన హోలీ లో కూడా వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలు షేర్ చేశారు. ఇక ఈయన తనుజని పెళ్లి చేసుకుంటాడు లేదో చూడాలి. ఏదేమైనా ప్రస్తుత కాలంలో పెళ్లి విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ న వ్యాఖ్యలు చూసిన పలువురు ఘోరంగా మండిపడుతున్నారు.