Trinayani April 16 2024 Episode 1214: అంతేనంటారా అని తిలోత్తమ అంటుంది. ఏదైతే అదే అయింది ఇంకోసారి ట్రై చెయ్ మమ్మీ అని వల్లభ అంటాడు. నా ప్రాణాలతో చెలగాటం ఆడకు రా అని తిలోత్తమ అంటుంది. చిన్నపిల్లలతో ఆటలాడకండి అని విక్రాంత్ అంటాడు. ఆ పిల్లకి ఏమీ కాలేదు కదా అని సుమన అంటుంది. చిన్న మంట వచ్చి చేయి కాలితేనే ఇంత బాధపడుతున్నారు గాయత్రి పెద్దమ్మని గంధపు చెక్కల్లో కాలిస్తే ఎంత బాదడాలి అని విక్రాత్ అంటాడు. చనిపోయాకే కదా కాల్చేది అని సుమన అంటుంది. సమయం సందర్భం లేకుండా అమ్మ గురించి మాట్లాడకు అని విశాల్ అంటాడు. అసలు మంట ఎలా వచ్చిందో తెలుసుకోండి అని వల్లభ అంటాడు.అసలు మీరు నోరు మూసుకుంటారా చిన్న మంట తగిలి చేయి కాలితేనే ఇంతలా అరుస్తున్నారు.
చిన్నపిల్లకి నెయిల్ పాలిష్ వేయకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు ఇంకా ఏం చేస్తున్నారు వెళ్ళండి అని హాసిని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,ఆ సినిమా నీ సమయస్ఫూర్తి కి హాండ్స్ అప్ నువ్వు గనుక హారతి పిల్లని తీసుకురాకపోతే గందరగోళం జరిగిపోయేది అని పావనమూర్తి అంటాడు. కాళీ అరిచేతికి బుగ్గలు రావడం కాదు గాయత్రి అత్తయ్య చీర ప్రాణం తీసే ఎలా ఉండాలి అని హాసిని అంటుంది. వదిన గారు మీరు గట్టిగా అరిచి అందరికీ నిజం తెలిసేలా చేయకు అని విశాల్ అంటాడు. ఇంతలో నైని అక్కడికి వస్తుంది. ఏమైంది చెల్లి అని హాసిని అడుగుతుంది. గాయత్రి పాప చేయి కాలింది చూడండి అని నైని చూపెడుతుంది. ఎలా కాలింది అమ్మ అని పావనమూర్తి అంటాడు. హాసినిక్క హారతి పలం తెచ్చినప్పుడు అక్కడే ఉంది కదా బాబాయ్ కాళీ ఉంటుంది అని నైని అంటుంది. చిన్న పిల్లకి కాలితే ఎలా ఓర్చుకుంది చెల్లి అని హాసిని అంటుంది. గాయత్రీ దేవి కదమ్మా అని పావనమూర్తి అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ బాబాయ్ అని హాసిని అంటుంది. నువ్వు హారతి పలని తీసుకొచ్చినప్పుడు గాయత్రి అక్క ఫోటో అక్కడ ఉంది కదా అందుకే గాయత్రీ కి కాలనీవ్వదు అని పావన మూర్తి అంటాడు. అర్థమైందా నైని అని విశాల్ అంటాడు. అంటే బాబాయ్ అన్నది గాయత్రి పాప గురించి కాదా అని నైని అంటుంది. లక్కీగా ఇంకా అమ్మకి ఏం కాలేదు అని విశాల్ అంటాడు.
ఏంటో మీరు మాట్లాడితే ఏమీ అర్థం కావట్లేదు పాపకైతే ఏం కాలేదు అంటారు అని నైని బాధపడుతుంది. మసి అంటుకుంటే తుడిస్తే పోతుంది అమ్మకి ఏం కాలేదు అని విశాల్ తన చేయి పట్టుకొని మసిని తుడిచేస్తాడు. కట్ చేస్తే, అమ్మ నెయిల్ పాలిష్ చేసుకోవడం ఎందుకు కడుక్కోవడం ఎందుకు అని వల్లభ అంటాడు. రేయ్ నెయిల్ పాలిష్ కడుక్కోవడం లేదురా చెయ్యి కాలింది కదా చల్లటి నీళ్లలో పెడుతున్నాను అని తిలోత్తమ అంటుంది. ఇంకా మీరు కర్పూరం వల్లే చేయి కాలిందని అనుకుంటున్నారా మమ్మీ గాయత్రీ పాప చేయి తాకడం వలన ఫైర్ వచ్చింది అని వల్లభ అంటాడు. ఆ పిల్లకు అదృష్టం పట్టింది తప్ప నేను తన చేయి పడితే బూడిదవడం ఉండదు నాన్న అని తిలోత్తమ అంటుంది. అమ్మ నా కళ్ళతో నేను చూసాను నమ్మంటారు ఏంటి మీరు అని వల్లభ అంటాడు. హాసిని చేసిన పని వాళ్ళ చేయి కాలింది కానీ ఆ బూరి బుగ్గల పిల్ల గాయత్రి నన్నేం చేస్తుంది నన్ను ఏదైనా చేయాలి అంటే గాయత్రి వల్లనే అవుతుంది అని తిలోత్తమ అంటుంది. ఇంకా నాకు అది అబద్ధం అనిపించట్లేదు మమ్మీ అని వల్లభ అంటాడు. భయంతో నీకు అలా అనిపిస్తుంది అంతే అని తిలోత్తమ అంటుంది. నా డౌట్ క్లియర్ అయిపోవాలి అని వెళ్లి గాయత్రిని తీసుకొని వస్తాడు వల్లభ. మళ్లీ ఈ పాపని ఎందుకు తీసుకొచ్చావు రా అని తిలోత్తమ అంటుంది.
మమ్మీ డౌట్ క్లియర్ చేసుకుందాం ఒకసారి చేయి పెట్టు అని వల్లభ బలవంతం చేయడంతో చేయి చాపుతుంది గాయత్రి పాపా తనని ముట్టుకుంటుంది కానీ మంట రాకపోవడంతో వల్లభ షాక్ అయిపోతాడు. చెప్తే విన్నావా వెళ్లి పాపని విడిచిపెట్టి రా అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే, ఇంతలో ఎద్దులయ్య డమ్మక్క ఇంటికి వస్తారు. ఎద్దులయ్య ఎప్పుడొచ్చారు అని విశాల్ అడుగుతాడు. విశాలాక్షి వస్తుంది అని ఎద్దులయ్య అంటాడు. ఎక్కడుంది అని నైని అడుగుతుంది. అక్క ఎప్పుడు వచ్చే పిల్ల కోసం గుమ్మం వంక ఎదురు చూడాలా అని సుమన అంటుంది. తను ఊటీ చేతులతో రావట్లేదు మాత అని ఎద్దులయ్య అంటాడు. ఈ గుడిలో ఆ గుడిలో పెట్టిన ప్రసాదం తీసుకొస్తుద ఏంటి అని తిలోత్తమ అంటుంది. ఆ మాట విని వల్లభ నవ్వుతాడు. బరువుగా ఉంటుందా నేను వెళ్లి తీసుకొస్తాను అని విక్రాంత్ అంటాడు. పుత్ర అది మగవాళ్ళు మోసేది కాదు ఆడవాళ్లు మోసేది అని ఎద్దులయ్య అంటాడు. ఏంటది అని దూరందర అంటుంది.
చూస్తే కానీ అర్థం కాదు అని పావనమూర్తి అంటాడు. ఇంతలో విశాలాక్షి రూపాన వచ్చిందని అందరూ సంతోషిస్తారు. నిన్ను చూస్తుంటే రెండు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది విశాలాక్షి అని నైని అంటుంది. అమ్మ ఎప్పుడు బిడ్డకి దండం పెట్టకూడదు అని విశాలాక్షి అంటుంది. విశాలాక్షి రూపాలు కనిపించే నీకు దండం పెడితే తప్పేముంది అమ్మ అని నైని అంటుంది. పెద్ద మరదలా వీరిద్దరు తిరిగా మాట్లాడుకుందురు కానీ ఆ పిల్ల ఏం మూట పట్టుకొచ్చిందో చూడు అని వల్లభ అంటాడు. అది చూసే కానీ అర్థం కాదు అని విశాలాక్షి అంటుంది.ఏం తీసుకొచ్చావో చూపించు అని సుమన అంటుంది. విశాలాక్షి మెడలో ఏముందో చూడు చిట్టి మాత అని ఎద్దులయ్య అంటాడు. ఏముంది మెడలో నక్లీసు పసుపు తాడు అని సుమన అంటుంది. ఏముందో ముందు చూపించు అని తిలోత్తమ అంటుంది. చూపిస్తుంది చూడు అని హాసిని అంటుంది. విశాలాక్షి తన మెడలో మంగళసూత్రాన్ని తీసి చూపెడుతుంది. ఏంటి అవి సోదరి అని పావన మూర్తి అంటాడు. వజ్రాలతో తయారుచేసిన మంగళ సూత్రాలు అని విశాలాక్షి అంటుంది. పెళ్లయిన వాళ్లు కూడా పెద్ద సూత్రాలు వేసుకోరమ్మ అని నైని అంటుంది. ఇవి ఏ గుళ్లో వేసిన అమ్మవారి మంగళ సూత్రాల ఉన్నాయి అని సుమన అంటుంది. అందుకే కదా వాళ్ళ ముగ్గురు మాట్లాడడం లేదు సుమన అని విశాలాక్షి అంటుంది. నీకు తెలుసా అత్తయ్య అని హాసిని అడుగుతుంది. చెప్పండి బావగారు అని సుమన అడుగుతుంది.
అ మంగళ సూత్రం లు మా అమ్మది అని విశాల్ అంటాడు.అదేంటి విశాల్ మీ అమ్మ ఎప్పుడు ఇంత పెద్ద మంగళసూత్రాలు వేసుకున్నట్టు కనిపించలేదు అని దురంధర అంటుంది.మరి విశాలాక్షి ఎందుకు వేసుకుంది అని విక్రాంత్ అంటాడు. గాయత్రి అక్క అప్పట్లోనే ఈ మంగళ సూత్రాలు 60 లక్షలు పెట్టి తయారు చేయించింది అని తిలోత్తమ అంటుంది. ఎవరికి చేయించింది అని వికాంత్ అంటాడు. అమ్మవారి కోసం కానుకగా ఇస్తానని వజ్రాలు పొదిగిన మంగళ సూత్రాలు అవి విశాలాక్షి మెడలోకి ఎలా వచ్చాయి అని తిలోత్తమ అంటుంది. ఎవరికంట పడకుండా దొంగతనం చేసవ విశాలాక్షి అని సుమన అంటుంది. చెల్లి తను దొంగతనం ఎందుకు చేస్తుంది అని నైని అంటుంది. దాని విలువ కోట్లలో ఉంటుంది ఎవరైనా తీసుకోమని ఇస్తారా అక్క అని సుమన అంటుంది. అసలు ఆ తాళి నీ మెడలో ఎలా వేసుకొచ్చిందని డౌట్ గా ఉంది అని వల్లభ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది