Yatra 2: భారతీయ చలనచిత్ర రంగంలో బయోపిక్ ల పర్వం సాగుతోంది. గత కొన్ని సంవత్సరాల నుండి రాజకీయంగా క్రీడారంగంలో రాణించిన అనేకమంది జీవితాలను ఆధారం చేసుకుని పలు బయోపిక్ సినిమాలు రావడం జరిగాయి. తెలుగులో కూడా అనేక సినిమాలు వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే ఆకట్టుకున్నాయి. ఈ రకంగా వైయస్ ఫ్యామిలీకి సంబంధించి దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కించిన యాత్ర, యాత్ర 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 2019లో విడుదలైన “యాత్ర” వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ ఏడాది “యాత్ర 2” వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటన ఆధారంగా తెరకెక్కించి హిట్ అందుకోవటం జరిగింది.
“యాత్ర 2” తీసిన విధానం వైసీపీ పార్టీ నాయకులకు విపరీతంగా నచ్చింది. ఈ క్రమంలో మహి వి.రాఘవ్ ను కొంతమంది వైసీపీ నాయకులు సత్కరించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల రాయలసీమలో రెండు ఎకరాలలో మహి వి.రాఘవ్ స్టూడియో నిర్మించడానికి రెడీ కావడం జరిగింది. అయితే దీనిపై కొన్ని చానల్స్ పత్రికలు.. నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నాయి. దీంతో మహి వి.రాఘవ్ వెంటనే స్పందించారు. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాయలసీమ మదనపల్లిలో పుట్టి పెరిగినట్లు అక్కడే చదువుకున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే ఆ ప్రాంతం కోసం కేవలం రెండు ఎకరాలలో మినీ స్టూడియో కట్టాలనుకుంటున్న. వెనకబడిన ప్రాంతంలో మంచి చేస్తుంటే…నాపై నెగటివ్ ప్రచారం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదో చేయాలని ఆశయం ఉంది కాబట్టే అక్కడ స్టూడియో నిర్మిస్తున్న. ఒకవేళ నాకు స్వార్థం ఉంటే హైదరాబాద్ లేదా వైజాగ్ లో స్టూడియో కట్టుకునే వాడిని కదా అని చెప్పుకొచ్చారు.
వెనుకబడిన ప్రాంతంగా చూసే మదనపల్లిలో.. స్టూడియో నిర్మించడానికి కారణం.. నా ప్రాంతం కోసం నా వంతుగా ఏదో ఒకటి చేయాలనే ఆశయంతో… మినీ స్టూడియో నిర్మించడానికి రెడీ అయినట్లు తెలిపారు. సినిమా పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్ చేయడానికి ఎవరు ఆసక్తి చూపరు. కానీ నా ప్రాజెక్టుల్లో అత్యధికంగా షూటింగ్ రాయలసీమ ప్రాంతంలోనే జరిగిందని అన్నారు. వాళ్ల ప్రభుత్వంలో వాళ్లకు నచ్చిన వారికి ఎవరెవరికో ఎక్కడెక్కడో భూములు ఇచ్చారు వాటి గురించి ఎవరు నోరెత్తారు. కానీ వెనకబడిన ప్రాంతం అక్కడ కొంతమందికి అయినా ఉపాధి కలుగుతుందని మినీ స్టూడియో నిర్మిస్తుంటే ఎందుకు అంత తప్పుడు ప్రచారం చేస్తారు అంటూ సదరు మీడియా ఛానల్స్ పై మహి వి.రాఘవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.