అసంఘటిత రంగ కార్మికులకు అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.వారికి ఆర్థికపరమైన భద్రత కల్పించడానికి కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది. అదే అటల్ పెన్షన్ యోజన స్కీమ్.
ఈ పథకం కింద కేవలం రోజుకు ఏడు రూపాయలు ఆదా చేస్తే నెలకు ఐదు వేల రూపాయల పింఛను లభిస్తుంది.అంటే సంవత్సరానికి అరవై వేల రూపాయలన్నమాట.కేంద్ర ప్రభుత్వం తాజాగా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ రూల్స్ను మార్చింది. ఇంకా నిబంధనలను సరళతరం చేసింది బ్యాంక్కు వెళ్లి ఈ స్కీమ్లో చేరొచ్చు.18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న వారు ఈ పథకంలో చేరొచ్చు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వారు మాత్రమే ఈ స్కీమ్లో చేరాలి. నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందొచ్చు.మనము ఆదా చేసే మొత్తాన్ని బట్టి పింఛను మొత్తం ఇవ్వడం జరుగుతుంది.అయితే ఇంతకు ముందులాగ ఆదా చేసే మొత్తాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం వంటివి ఇకపై కుదరవు .చేరేటప్పుడే ఎంత పింఛను కావాలో నిర్ణయించుకుని ఆ మేరకు ఆదా చేసుకోవాల్సి ఉంటుంది.ఖాతాదారుడు గనక మరణిస్తే జీవిత జీవిత భాగస్వామికి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.పూర్తి పూర్తి వివరాల కోసం ఏ జాతీయ బ్యాంకు పైన వెళ్తే సరిపోతుంది.ఇది చాలా మంచి పథకమని ఆర్థిక నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు.