కివి ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చిన పండు. నిజానికి కివీ పండు సాధారణ పండు కాదు. ఏ పండ్లలో లేనన్ని పోషకాలు కివి లో పుష్కలంగా ఉన్నాయి. కివీ తీసుకోవడం వలన రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ పండులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగ పడుతుంది. కివి పండు అనేక రకాల అనారోగ్యాల కు మంచి ఔషధం గా పనిచేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు, ముఖ్యం గా నిద్రలేమితో బాధపడేవారికి కివీ పండు దివ్యౌషదంగా పనిచేస్తుంది. . కివీ పండు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
నారింజ, నిమ్మలో కంటే కివీ లో అత్యధికంగా విటమిన్-C ఉంది .రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తీసుకుంటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు . కివీలో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల మానసిక వ్యాధులు కూడా తగ్గుతాయి.
వయ్యస్సు పెరుగుతున్నపుడు వచ్చే కణజాల క్షీణతను ఇవి ఎక్కువశాతం తగ్గించగలవు. కివీలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమిని పోగొట్టడానికిబాగాఉపయోగ పడుతుంది.పడుకోడానికి గంట ముందు రెండు కివీ పళ్లు తింటే హాయిగా నిద్రపడుతుంది.
నిద్రలేమితో బాధపడుతున్న వారికీ ఇది మంచి ఔషధం.గర్భిణీలు కివీ పండ్లు తింటే బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.ఈ పండు గుండెకు కూడా చాలా మంచిది.రక్తపోటు నియంత్రణలో కివీ పండ్లు బాగా పనిచేస్తాయి.
ఇది మధుమేహం ఉన్న వారికి మేలు చేస్తుంది..కివీ పండులో అధిక శాతంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.