అమరావతి: జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనున్నారు.
ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ, కాపు, అగ్రవర్ణాల పేదలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఐటిఐ విద్యార్థులకు పదివేల రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15వేల రూపాయలు, డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఏడాదికి 20 వేల రూపాయలు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందనున్నది.
వార్షిక ఆదాయం రెండున్నర లక్షల రూపాయల లోపు ఉన్న పేద కుటుంబాల పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
అర్హులైన విద్యార్థులను ఎంపిక చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.