విశాఖపట్నం: విశాఖ భూకుంభకోణంపై సీబీఐ లేదా జుడీషియల్ విచారణ జరపాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ను విస్తృత పరిచినా ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. ఈ సిట్ వ్యవహారంపై ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ భూకుంభకోణంలో అంతా అధికార, విపక్ష ముఖ్యనేతలే ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో వేసిన సిట్ ఎంతో, వైసీపీ వేసిన సిట్ అంతేనని ఆయన అన్నారు. సిట్కు ఉన్న పరిధి చాలా పరిమితమని నారాయణ పేర్కొన్నారు.
previous post
next post