విజయవాడ: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పారు. నేటి సాయంత్రం వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని అసంతృప్తితో ఉన్న అవినాష్ వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నిన్న సాయంత్రం విజయవాడలో తన అనుచరులు, పార్టీ శ్రేణులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఆయనతో పాటు కడియాల బుచ్చిబాబు, తదితరులు నేటి సాయంత్రం వైసిపిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీకి, తెలుగుయువత పదవికి అవినాష్ నేడు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను టిడిపి రాష్ట్ర కార్యాలయానికి పంపారు.ఈ నేపథ్యంలోనే అవినాష్ తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబు, లోకేష్లతో ఉన్న కవర్ ఫోటోను తొలగించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన అవినాష్ మంత్రి కొడాలి నాని చేతిలో పరాజయం పాలయ్యారు.
అవినాష్ ట్విట్టర్లో కవర్ ఫోటో తొలగించిన దృశ్యం