అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఛార్జ్ సిఎస్ నీరబ్కుమార్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నీలం సాహ్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు.
1984 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణాజిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా, నల్లగొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లి గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత ఏపిఐడిసి విసి అండ్ ఎండిగా ఉన్నారు. అనంతరం స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు.
2018 నుంచి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర సర్వీసు నుండి ఆమెను రిలీవ్ చేశారు. నిన్న ప్రభుత్వం నీలం సాహ్నిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సతీనాయర్, మిన్నీ మాథ్యూ మహిళా సీఎస్లుగా సేవలందించగా నవ్యాంధ్రలో తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు.