Madhavi Latha:ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రెండింగ్లో నిలిచే సినీ నటి మాధవీలత మరో సారి హాట్ కామెంట్స్ చేసింది. కొంత కాలంగా బిగ్ బాస్ షోపై తనదైన స్టైల్లో సీరియస్ అవుతున్న ఈ అమ్మడు.. రీసెంట్గా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. బిగ్ బాస్ షోలో సిచ్చువేషన్స్, హోస్ట్ పై సీరియస్ అవుతూ పోస్టు పెట్టిన మాధవీలత… అదే పోస్టులో సమంత విడాకులు విషయాన్ని ప్రస్తావిస్తూ అందరికీ షాక్ ఇచ్చింది.
Samantha: సమంత వచ్చి పుష్పరాజ్ లెక్కలు మార్చేసిందా..?
అనాగరిక చర్యలు
బిగ్ బాస్లో అనాగరికి చర్యలు జరుగుతున్నాయని తనకు తెలిసనట్టు చెప్పుకొచ్చిన మాధవీలత.. ఇలాంటి వాటికి మానవ హక్కులు, ప్రజా సంఘాల వారు స్పందించరని ఘాటుగానే చెప్పింది. నాగరిక సమాజంలో బ్రతుకున్న వ్యక్తిని సూసైడ్ చేసుకునే తీరులో బిగ్ బాస్ టీం, నాగార్జున అవమానించారని చెప్పుకొచ్చింది. అలాగే ప్రజలు సైతం నాగార్జునను అలా చేస్తూ ఊరుకుంటారా? అలా చేస్తే నెక్ట్స్ డేనే ఆయన గాయబ్ అవుతాడంటూ సీరియస్ అయింది.
Karthika Deepam : బోల్తా కోట్టిన మౌనిత ప్లాన్ …!
వారికి రూ.100 కోట్ల ఫైన్
మన గత కాలంలో పల్లెల్లో తప్పు చేసిన వాడికి సగం మీసం గీయడం, అరగుండు, గుండు కొట్టించడం వంటి శిక్షలు ఉండేవి. సున్నిత మనస్కులు వీటి కారణంగా ఆత్మహత్యలు చేసుకునేవారు అంటూ చెప్పొకొచ్చింది. బిగ్బాస్ టీంలో ఇప్పటికీ అలాంటి ఆలోచనలతో ఉన్న వారినే టీంగా సెలక్ట్ చేసుకున్నారంటూ వీర లెవల్లో ఫైర్ అయింది. బిగ్బాస్ హౌస్ ఒక ఆలయమని, ఇక్కడ జ్ఞానం వస్తుందని అన్నట్టు డబ్బా కొడుతూ తప్పును నిలదీయలేని ఒక హోస్ట్ విషపు ఆలోచనలకి బాటలు వేస్తున్నాడని సీరియస్ అయింది. ఆ మినిస్ట్రీ మీద తనకు పగ్గాలు దక్కితే ఇలాంటి షోలను నడుపుతున్న యాజమాన్యానికి, హోస్ట్కు రూ.100 కోట్ల ఫైన్ వేస్తానని చెప్పుకొచ్చింది. అయితే సామ్ విడాకులు విషయం ప్రపంచ వింతలా టెలికాస్ట్ చేసిన చానెళ్లు, విలేకరులు.. ఇలాంటి అనాగరిక చర్యల మీద ఎందుకు మాట్లాడటం లేదు. ధైర్యం లేదా? లేక భయమా? అంటూ ప్రశ్నించింది. మరిన్ని ప్రశ్నలను ప్రజలపై సందించింది.