Bhagavanth Kesari: అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన “భగవంత్ కేసరి” అక్టోబర్ 20వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమా విడుదల అవటానికి వారం రోజులు మాత్రమే ఉండటంతో భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం “భగవంత్ కేసరి” టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో బాలకృష్ణ పలికిన డైలాగులు బాలకృష్ణ కూతురిగా కుర్ర హీరోయిన్ శ్రీలీల.. నటన టీజర్ కి హైలైట్ గా నిలిచింది. దీంతో టీజర్ టైటిల్ పోస్టర్లతో మంచి రెస్పాన్స్ రావడంతో “భగవంత్ కేసరి” ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్లు దాటేసినట్లు టాక్ నడుస్తోంది.
భారీ అంచనాలు కలిగిన ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు సరికొత్త వార్త సోషల్ మీడియాలో అందరికి షాక్ గురి చేసింది. విషయంలోకి వెళ్తే “భగవంత్ కేసరి” సినిమాకి సంబంధించి సెకండాఫ్ లో 40 నిమిషాల స్టోరీ..లీక్ కావడం జరిగింది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. అంతేకాదు చాలా ఎంటర్టైనర్ గా ఇంట్రెస్టింగ్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో అనిల్ రావిపూడి డిజైన్ చేయడం జరిగిందట. మాస్ మరియు క్లాస్ ఆడియన్స్ నీ దృష్టిలో పెట్టుకుని బాలయ్య బాబుని చాలా పవర్ఫుల్ గా చూపిస్తూనే మరోపక్క.. కామెడీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట. “భగవంత్ కేసరి” సినిమా మొత్తానికి ఈ 40 నిమిషాలు చాలా హైలెట్ గా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్.
శ్రీ లీలా మరియు బాలకృష్ణ మధ్య కొద్దిగా సన్నివేశాలు సీరియస్ గా ఉన్నాగాని చుట్టుప్రక్కల పాత్రలలో అద్భుతమైన కామెడీ రావటం జరిగిందట. ఇక సినిమాలో విలన్ పాత్ర చేసిన బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్.. బాలయ్య మధ్య యాక్షన్స్ సన్నివేశాలు గుస్ బంప్స్ తెప్పిస్తాయట. అనిల్ రావిపూడి తన మార్క్ టైమింగ్ కామెడీతో పాటు బాలయ్య అని అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ కి నచ్చే రీతిలో ఈ సినిమాలో చూపించడం జరిగింది. దసరా కానుకగా రాబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చాలా సంవత్సరాల తర్వాత హీరోయిన్ గా నటించింది.