Akhanda 2: తెలుగు చలనచిత్ర రంగంలో మాస్ సినిమాలు చేయడంలో బోయపాటి శ్రీను సిద్ధహస్తుడని అందరికీ తెలుసు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహా, లెజెండ్, సరైనోడు, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. బాలకృష్ణతో బోయపాటి చేసిన మూడు సినిమాలు తిరుగులేని విజయాలు అందుకోవటం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల రామ్ పోతినేనితో.. “స్కంద” అనే సినిమా చేయడం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పరాజయం పాలయ్యింది. ఈ క్రమంలో బోయపాటి తన తర్వాత సినిమా అల్లు అర్జున్ లేదా సూర్యతో ఉండే అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రస్తుతం అల్లు అర్జున్..”పుష్ప” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు విడుదల కాబోతోంది. “పుష్ప” చేసిన తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్. ఆల్రెడీ అల్లు అర్జున్ కి సంబంధించిన ప్రాజెక్ట్ స్క్రిప్ట్ త్రివిక్రమ్ కంప్లీట్ చేయడం జరిగిందంట. కానీ బోయపాటి..అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ ఇంకా మెరుగులు చేసే పనిలో ఉన్నారట. దీంతో ఇప్పుడు “పుష్ప” తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉండటంతో బన్నీ ప్రాజెక్టును పక్కనపెట్టి “అఖండ” సీక్వెల్ చేయటానికి బోయపాటి రెడీ అయ్యారట. సూర్య ప్రాజెక్ట్ కూడా స్టార్టింగ్ దశలో ఉండటంతో..”అఖండ” సీక్వెల్ చేయాలనీ ఫిక్స్ అయ్యారట.
2021లో విడుదలైన “అఖండ” సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అఘోర పాత్రలో బాలకృష్ణని చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. తమన్ మ్యూజిక్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. కరోనా సమయంలో విడుదల అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డ్స్ క్రియేట్ చేయడం జరిగింది. గతంలోనే ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అయినట్లు తెలపగా.. ఇటీవల కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ఏపీలో ఎన్నికలకు ముందే విడుదల కాబోతోంది. దీంతో బాబీ ప్రాజెక్ట్ అయినా వెంటనే బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో “అఖండ” సీక్వెల్ చేయబోతున్నట్లు టాక్.