మలయాళ చిత్ర సీమ నుండి చాలా మంది ముద్దుగుమ్మలు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్స్ రేంజ్కు ఎదిగారు. ఇప్పుడు అలాగే మరో మలయాళ భామ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వివరాల్లోకెళ్తే.. మెగా కుటుంబం నుండి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో హీరోయిన్గా మేఘా ఆకాశ్ సహా కొద్ది మంది హీరోయిన్స్ పేర్లు వినిపించినా, లెటెస్ట్ సమాచారం ప్రకారం దేవికా సంజయ్ హీరోయిన్గా నటించనుంది. గత ఏడాది `ఎంజన్ ప్రకాశం` అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసి నటిగామంచి పేరు సంపాదించుకుంది దేవికా సంజయ్. దేవికా సంజయ్ అయితే కథానుగుణంగా పాత్రకు తగు న్యాయం చేస్తుందని దర్శక నిర్మాతలు భావించి ఆమెతో సంప్రదింపులు జరిపారు. రెండు వైపులా అంతా ఓకే అయినట్లు వార్తలు వినపడుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
previous post
next post