నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో 106 సినిమాగా రూపొందుతుంది. అంతేకాదు బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం కూడా విశేషం. ఈ సినిమాని ద్వారక క్రియోషన్స్ బ్యానర్ లో మిరియాల రవీందెర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి తాజగా BB3 ఫస్ట్ రోర్ ని రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ రోర్ కి ప్రేక్షకుల నుండి నందమూరి అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపించనున్నాడు. అందులో ఒక పాత్ర బాలయ్య ఇప్పటి వరకు తన కెరీర్ లోనే చేయనటువంటి అఘోరా పాత్ర కావడం ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోను హాట్ టాపిక్ అవుతోంది. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ రోజే నందమూరి బాలకృష్ణ ఒక పాటని పాడి ఆ పాట టీజర్ ని రిలీజ్ చేయడం విశేషం. తన తండ్రి నందమూరి తారక రామారావు నటించిన అద్భుత దృశ్య కావ్యం “జగదేక వీరుని కథ” సినిమా లోని” శివ శంకరి… శివానంద లహరి” అన్న పాటను బాలయ్య పాడటం గొప్ప విషయం.
ఇంతక ముందు మొదటి సారి పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పైసా వసూల్ సినిమాలో “మావా ఎక్ పెగ్ లా” అని హుషారెత్తించిన బాలయ్య అందుకు పూర్తి భిన్నంగా ఈ పాట పాడటం అందరిని ఆశ్చర్యానికి గురి ఆనందానికి చేస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ మరో రెండు సినిమాలలో నటించబోతున్నాడని సమాచారం. అందులో ఒకటి సింగీతం శ్రీనివాస రావు బాలకృష్ణ కాంబినేషన్ లో గతంలో వచ్చి సెన్షేషనల్ హిట్ అందుకున్న ఆదిత్య 369 కి సీక్వెల్ కాగా మరొక సినిమా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఉండబోతుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.