మంచు మనోజ్.. మంచు ఫ్యామిలీకి చెందిన ఈ హీరో కొంత కాలంగా సినిమా రంగానికి దూరమైయ్యారు. మోహన్బాబు రెండో తనయుడిగానే కాదు.. హీరోగా కూడా తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు మనోజ్ . వ్యక్తిగత జీవితంలోనూ ఆయన కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. ఇటీవల తాను భార్య ప్రణతి నుండి విడిపోయానని, ఇద్దరం విడాకులు తీసుకున్నామని కూడా తెలియజేశాడు. కాగా అదే సందర్భంలో తాను కొత్త జర్నీని స్టార్ట్ చేయబోతున్నానని, త్వరలోనే వివరాలను కూడా తెలియజేస్తానని సినిమాలే తన జీవితమని కూడా చెప్పుకొచ్చారు.
అన్నట్లుగానే మంచు మనోజ్ దీపావళి సందర్భంగా తాను నిర్మాతగా మారుతున్నట్లు ప్రకటించారు. ఎం.ఎం.ఆర్ట్స్ అనే బ్యానర్ను స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన మనోజ్, బ్యానర్ లోగోను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. “నా కొత్త ప్రయాణం మొదలైంది. నా బ్యానర్ ఎం.ఎం.ఆర్ట్స్ నుండి నా తదుపరి చిత్రాలు వస్తాయి. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయడానికి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాను. నా బ్యానర్ నుండి ఇకపై చాలా మంచి చిత్రాలే వస్తాయి“ అంటూ మెసేజ్ను కూడా పోస్ట్ చేశారు. మరి ఇప్పటికే మంచు ఫ్యామిలీలో మోహన్బాబుకు ఓ బ్యానర్, విష్ణు, లక్ష్మిప్రసన్నలకు కూడా బ్యానర్స్ ఉన్నాయి. ఇప్పుడు మంచు మనోజ్ కూడా బ్యానర్ స్టార్ట్ చేశారు.
previous post