Pushpa 2: ప్రస్తుతం దేశం మొత్తం “పుష్ప 2” కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా యాగంటిలో సాంగ్ చిత్రీకరణ జరుపుకుంది.
ఇదే సమయంలో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందన పాల్గొన్నారు. దీంతో “పుష్ప 2” షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. రష్మిక మందన ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించిన ఫోటో సోషల్ మీడియాలో బయటపడింది. “పుష్ప”లో రష్మిక శ్రీవల్లి పాత్రలో నటించడం జరిగింది. ఇక ఇదే ఫోటో రష్మిక సైతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇవ్వాల ఈ దేవాలయంలో మూవీ చిత్రీకరణ జరిగింది. యాగంటి అని పిలవబడే ఈ ఆలయ స్థల పురాణం నిజంగా చాలా అద్భుతం. ఇక్కడి ప్రజలు వారి ప్రేమ మాటల్లో చెప్పలేం.
ఈరోజు చాలా అద్భుతంగా గడిచింది అని తన అనుభవాన్ని పంచుకుంది. శ్రీవల్లి పాత్రలో “పుష్ప” భార్యగా రష్మిక మందన పాత్ర ఉండబోతుంది. మొదటి భాగం కంటే రెండో భాగంలో మసాలా చాలా ఎక్కువ అని.. అంతేకాకుండా పాత్రల మధ్య వైవిధ్యం కూడా అదే స్థాయిలో ఉంటుందని టాక్. ఏప్రిల్ 8వ తారీకు అల్లు అర్జున్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆరోజు… “పుష్ప 2” నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు “పుష్ప” మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధికమైన భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.